AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే రూపాయి తిరుగులేని శక్తిగా మారనుంది! RBI డిప్యూటీ గవర్నర్‌ సంచలన స్టేట్‌మెంట్‌

ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ టీ. రబీ శంకర్ స్పష్టం చేసినట్లుగా, రూపాయి నిర్వహణకు తాత్కాలిక చర్యలు అస్థిరతను నియంత్రించి, ఊహాగానాలను అరికట్టడానికే. దీర్ఘకాలంలో రూపాయిని అంతర్జాతీయీకరణ చేయాలనే లక్ష్యానికి దేశం కట్టుబడి ఉంది. మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ఈ పరిమితులు తొలగిస్తారు.

ప్రపంచంలోనే రూపాయి తిరుగులేని శక్తిగా మారనుంది! RBI డిప్యూటీ గవర్నర్‌ సంచలన స్టేట్‌మెంట్‌
Indian Rupee Rbi
SN Pasha
|

Updated on: Apr 23, 2026 | 6:35 AM

Share

భారత రూపాయి నిర్వహణపై తీసుకున్న తాజా చర్యలు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో కరెన్సీ అంతర్జాతీయీకరణ లక్ష్యానికి దేశం కట్టుబడి ఉందని RBI డిప్యూటీ గవర్నర్ టీ.రబీ శంకర్‌ స్పష్టం చేశారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కరెన్సీ మార్కెట్‌లో ఏర్పడిన అస్థిరతను నియంత్రించడానికే మార్చి 30, ఏప్రిల్ 1 తేదీల్లో కొన్ని పరిమిత చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం మితిమీరిన ఊహాగానాలను అరికట్టడం, అలాగే అమెరికన్ డాలర్‌కు కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడటమని ఆయన వివరించారు. అయితే ఈ చర్యలను పూర్తిగా ఎప్పుడు ఉపసంహరించుకుంటారన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ వారం ప్రారంభంలోనే కేంద్ర బ్యాంక్ కొన్ని పరిమితులను పాక్షికంగా సడలించింది. దీని ప్రకారం అధీకృత డీలర్లు రూపాయికి అనుసంధానమైన డెలివరీ చేయలేని డెరివేటివ్ కాంట్రాక్టులను మళ్లీ నివాసి, ప్రవాస వినియోగదారులకు అందించేలా అనుమతి ఇచ్చారు. నికర ఓపెన్ పొజిషన్లపై ఉన్న 100 మిలియన్ డాలర్ల పరిమితిని ఎప్పుడు ఎత్తివేస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ, శంకర్ దీర్ఘకాల లక్ష్యాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రూపాయిలో లావాదేవీలు జరిగేలా, ఒకే గ్లోబల్ మార్కెట్‌ను సృష్టించడం ఆర్‌బిఐ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇటీవలి చర్యలు కేవలం తాత్కాలిక అస్థిరతను ఎదుర్కొనేందుకే తీసుకున్నవని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మామూలు విధానాలకు తిరిగి వస్తామని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు, కరెన్సీ విలువ పెరుగుదల లేదా పడిపోవడాన్ని నియంత్రించేందుకు కాకుండా, అసాధారణ ఊహాగానాల వల్ల మార్కెట్‌లో ఏర్పడే అతివేగ మార్పులను అరికట్టడానికే జోక్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రూపాయి విలువ ప్రధానంగా డిమాండ్, సరఫరా ఆధారంగా నిర్ణయించబడుతుందని తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే కేంద్ర బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ఒత్తిడి కనిపించినప్పుడు, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటం తమ బాధ్యత అని, అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని RBI పునరుద్ఘాటించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us