AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: జనవరి 22న కరెన్సీ మార్కెట్‌లో హాఫ్ డే.. ఈ ముఖ్యమైన పనులు జరగవు

కరెన్సీ మార్కెట్‌లో సగం రోజులు మాత్రమే పని చేయాలని ఆర్‌బీఐ ప్రకటించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ట రోజున ప్రభుత్వ సెలవుదినం కావడంతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కార్యాలయాలకు సెలవు ఉంటుంది. దీంతో దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న రూ.2000 నోట్ల మార్పిడి పనులు నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకునే పని ఆగిపోయింది..

RBI: జనవరి 22న కరెన్సీ మార్కెట్‌లో హాఫ్ డే.. ఈ ముఖ్యమైన పనులు జరగవు
RBI
Subhash Goud
|

Updated on: Jan 20, 2024 | 6:45 AM

Share

జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు హాయిగా వీక్షించేందుకు వీలుగా ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజులు సెలవులు ఉండబోతున్నాయి. కానీ ఈ సెలవు కారణంగా సాధారణ ప్రజలకు చాలా ముఖ్యమైన పని చేసుకోవడం ఆ రోజు సాధ్యం కాదు. ఇది కూడా నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది. కాగా కరెన్సీ మార్కెట్‌లో సగం రోజులు మాత్రమే పని చేయాలని ఆర్‌బీఐ ప్రకటించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ట రోజున ప్రభుత్వ సెలవుదినం కావడంతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కార్యాలయాలకు సెలవు ఉంటుంది. దీంతో దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న రూ.2000 నోట్ల మార్పిడి పనులు నిలిచిపోనున్నాయి.

ఆర్‌బీఐకి చెందిన 19 కార్యాలయాలు మూతపడనున్నాయి:

ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకునే పని ఆగిపోయింది. అయితే దేశవ్యాప్తంగా 19 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కార్యాలయాల్లో ఇప్పటికీ వాటిని మార్పిడి చేస్తున్నారు. ప్రజలు తమ మిగిలిన రూ.2000 నోట్లను కూడా పోస్ట్ ద్వారా మార్చుకోవచ్చు. జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ట సెలవు కావడంతో ఆ రోజు ఆర్‌బీఐ కార్యాలయాల్లో కూడా నోట్ల మార్పిడి జరగదు. ఈ సదుపాయం జనవరి 23న అంటే మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు ఉన్నాయి.

రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుక కారణంగా జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకు కరెన్సీ మార్కెట్లు మూసివేయబడతాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు బదులు మధ్యాహ్నం 2:30 గంటలకు తెరిచి, మధ్యాహ్నం 3:30కి బదులు సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ జరుగుతుంది. ఈ నిర్ణయంతో, కాల్/నోటీస్/టర్మ్ మనీ, ప్రభుత్వ బాండ్‌లు, కార్పొరేట్ బాండ్‌లు, ఆర్‌బిఐ నియంత్రణలో ఉన్న విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన ట్రేడింగ్ సగం రోజులలో మాత్రమే జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి