March 31: మార్చి 31 లోపు ఈ పని చేయండి.. లేదంటే ఈ రెండు ఖాతాలు క్లోజ్ అయ్యే ఛాన్స్.. అవేంటంటే?
మీరు కనీస అవసరమైన మొత్తాన్ని జమ చేయకపోతే, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఖాతా యాక్టివ్గా ఉండాలంటే ఈ పథకాలలో కనీస పెట్టుబడిని కొనసాగించాలి. మీరు ఖాతాలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తాన్ని జమ చేయాలి.

మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా ఉంటే.. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్బు డిపాజిట్ చేయలేకపోతే, ఖాతాను యాక్టివ్గా ఉంచడానికి మార్చి 31 వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఖాతా యాక్టివ్లో ఉండాలంటే అందులో కొంత డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. PPF, SSYలో డబ్బు జమ చేయకపోతే ఈ ఖాతాలు మూసివేయబడతాయి.
మీరు కనీస అవసరమైన మొత్తాన్ని జమ చేయకపోతే, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఖాతా యాక్టివ్గా ఉండాలంటే ఈ పథకాలలో కనీస పెట్టుబడిని కొనసాగించాలి. మీరు ఖాతాలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తాన్ని జమ చేయాలి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)..
పీపీఎఫ్ ఖాతాదారులకు కనీస డిపాజిట్ రూ. 500లు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే మీ ఖాతా మూసివేసే ఛాన్స్ ఉంది. ఇందులో డబ్బును జమ చేసేందుకు చివరి తేదీ 31 మార్చి 2023 అని గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు ఈ మినిమమ్ బ్యాలెన్స్ను ఈ తేదీలోపు జమ చేయాలి. చివరి తేదీ వరకు మీరు డబ్బును డిపాజిట్ చేయకపోతే, మీరు సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. PPF ఖాతాకు ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తుంది.




సుకన్య సమృద్ధి యోజన (SSY)..
అలాగే సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా ఉంటే, మీరు ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే, రూ. 50 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రస్తుతం 7.6% వడ్డీని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..