Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? రూ. లక్ష పెడితే రూ.2 లక్షల వరకు పొందవచ్చు..!

Postal Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. మంచి రాబడి..

Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? రూ. లక్ష పెడితే రూ.2 లక్షల వరకు పొందవచ్చు..!
Follow us

|

Updated on: Jul 02, 2021 | 6:18 AM

Postal Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. మంచి రాబడి పొందాలని భావించే వారికి మంచి అవకాశం. అందుకు మీకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ రు మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ డబ్బును పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి పొందవచ్చు. ఆ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. ఇందులో మీరు డబ్బులు పెడితే కొన్ని నెలల్లో రెట్టింపు అవుతుంది.

ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత మెచ్యూరిటీ సమయంలో తీసుకోవాలి. మీరు ఇందులో లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే 2 లక్షల రూపాయలు చేతికందుతాయి. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ యవచ్చు. కనీసం రూ.1000 ఉంటే చాలు.. ఈ పథకంలో చేరవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

LIC Loan: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. సులభంగా రుణాలు పొందే సదుపాయం.. ఏఏ పాలసీలపై అంటే..!

Latest Articles