AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం శుభవార్త.. వచ్చే నెలలోనే పీఎం కిసాన్ సొమ్ము జమ

భారతదేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌ను అమలు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా కింద రూ.6 వేలను జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ 20 వాయిదాపై కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ 20 విడతను జమ చేస్తామని స్పష్టం చేసింది.

PM Kisan: రైతులకు కేంద్రం శుభవార్త.. వచ్చే నెలలోనే పీఎం కిసాన్ సొమ్ము జమ
Nikhil
|

Updated on: May 07, 2025 | 4:00 PM

Share

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇస్తుంది. అలాంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీని కింద కేంద్రం మూడు విడతలుగా డీబీటీ ద్వారా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగు నెలల విరామంతో 19 వాయిదాలను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో 19వ విడతను విడుదల చేశారు. దీంతో 2.4 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.

18వ విడత అక్టోబర్ 2024లో విడుదలైంది మరియు 17వ విడత జూన్ 2024లో చెల్లించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 చొప్పున అందిస్తారు. ఈ డబ్బును ప్రతి సంవత్సరం మూడు విడతలుగా అందిస్తారు. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 

పీఎం కిసాన్ చివరి 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసినందున తదుపరి విడత (20వ విడత) పీఎం కిసాన్ పథకం జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీ దీనిని విడుదల చేస్తారు. అయితే కచ్చితమైన తేదీ, స్థలం ఇంకా ప్రకటించలేదు. కాబట్టి రైతులు అర్హతను తనిఖీ చేయడం, కేవైసీ పూర్తి చేయడం, లబ్ధిదారుల స్థితిని తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీ ఇలా

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • ఆ పేజీ కుడి వైపున ఉన్న ‘మీ స్థితిని తెలుసుకోండి’ ట్యాబ్‌పై క్లిక్ చేయాాలి. 
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, కాప్చా కోడ్‌ను పూరించి, ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకోవాలి. 
  • మీ బెనిఫీషరీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..