AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel crisis: దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. యూనివర్సల్‌ సర్వీస్‌ అబ్లిగేషన్‌ను విస్తరించిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సంక్షోభం కొనసాగుతోంది. దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో పరిమిత సమయం వరకు విక్రయిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

Petrol Diesel crisis: దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. యూనివర్సల్‌ సర్వీస్‌ అబ్లిగేషన్‌ను విస్తరించిన కేంద్రం..
Petrol Diesel Price
Srinivas Chekkilla
|

Updated on: Jun 18, 2022 | 6:52 AM

Share

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సంక్షోభం కొనసాగుతోంది. దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో పరిమిత సమయం వరకు విక్రయిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ పరిధిని విస్తరించింది. ఇది ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది దేశంలోని ప్రతి ప్రాంతంలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిబంధన ప్రకారం పెట్రోల్‌ పంపు రిటైలర్లను తెరిచి మూసివేయాలన్నా ప్రభుత్వ సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో తగినంత చమురును సరఫరా చేయాలి. ప్రతి కంపెనీ తన వద్ద తగినంత చమురు నిల్వ ఉంచుకోవాలి. నివేదికల ప్రకారం, ప్రైవేట్ చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ సరఫరాను 50 శాతానికి పైగా తగ్గించాయి. దీంతో ప్రభుత్వ పెట్రోలు పంపులపై ఒత్తిడి పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వేలాది పెట్రోల్ పంపుల స్టాక్ పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి.

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమకు సరిపడా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. దేశంలో చమురు మార్కెటింగ్‌కు మూడు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ఫరీదాబాద్, గురుగ్రామ్‌లో చమురు సంక్షోభం ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సమస్య కూడా తలెత్తింది. పంజాబ్‌, కర్ణాటక, హిమాచల్‌ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నేటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెట్రోలు-డీజిల్ ధర ఈరోజుతో స్థిరపడి 28 రోజులు అయింది. మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది.