Fastag Penalty: ఫాస్టాగ్పై పెనాల్టీలు బాధుడు షురూ.. ఆ ఒక్క పనితో మీ సొమ్ము సేఫ్
కొంతమంది డ్రైవర్లు ఫాస్ట్ట్యాగ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా గణనీయమైన పెనాల్టీలు చెల్లిస్తున్నారు. ఈ విషయమై ప్రజలు ఫిర్యాదు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) దర్యాప్తు చేయగా అసలైన కారణం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఇటువంటి పొరపాట్లు చేయవద్దని వాహన డ్రైవర్లకు ఎన్హెచ్ఏఐ విజ్ఞప్తి చేసింది.

ఫాస్ట్ట్యాగ్ని ఇన్స్టాల్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి పెనాల్టీ చెల్లించకుండా నిరోధించవచ్చని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. వాహనంలో ఫాస్ట్ట్యాగ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్నిసార్లు జరిమానా విధించవచ్చు. వింతగా అనిపించినా ఇది నిజం. కొంతమంది డ్రైవర్లు ఫాస్ట్ట్యాగ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా గణనీయమైన పెనాల్టీలు చెల్లిస్తున్నారు. ఈ విషయమై ప్రజలు ఫిర్యాదు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) దర్యాప్తు చేయగా అసలైన కారణం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఇటువంటి పొరపాట్లు చేయవద్దని వాహన డ్రైవర్లకు ఎన్హెచ్ఏఐ విజ్ఞప్తి చేసింది.
ఫాస్ట్ట్యాగ్పై పెనాల్టీ ఎందుకు?
ఈ సమస్య అప్పుడప్పుడు ఫాస్టాగ్ చెల్లించే వాహనాలకు ఉత్పన్నమవుతుందని తేలింది. వాహనదారులు మొదటిసారి అక్కడికి వెళ్లినప్పుడు వారు టోల్ను నగదు రూపంంలో చెల్లించి ఉండవచ్చు. ఫిబ్రవరి 2021 నుంచి ఫాస్ట్ట్యాగ్లు తప్పనిసరి అయినప్పటి నుంచి వాహనంలో ఫాస్ట్ట్యాగ్ ఉన్నప్పటికీ పెనాల్టీలు విధించబడుతున్నాయి. దీనికి గల కారణాన్ని వివరించలేని టోల్ కార్మికులతో డ్రైవర్లు వాదిస్తున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 2016లో ఫాస్ట్ట్యాగ్లను ప్రవేశపెట్టింది. ఆ నెల తర్వాత కొత్త వాహనాలకు ఫాస్ట్ట్యాగ్లు తప్పనిసరయ్యాయి. అంటే ఇప్పుడు షోరూమ్లో ప్రతి వాహనంలో ఫాస్టాగ్ని అమర్చారు. ఫాస్టాగ్తో మొదటి లావాదేవీ డిసెంబర్ 2016లో ప్రారంభమైంది. కాబట్టి మీరు నవంబర్ 2016లో వాహనాన్ని కొనుగోలు చేస్తే మీ ఫాస్టాగ్ టోల్ ప్లాజాల వద్ద పని చేయదు. అందువల్ల ఇప్పుడు మీరు దానిని భర్తీ చేయాలి.
పాత ఫాస్టాగ్ బ్యాలెన్స్ని కొత్తదానికి బదిలీ ఇలా
వాహన డ్రైవర్లు పాత ఫాస్ట్ట్యాగ్ని తీసివేసి కొత్త దాన్ని తీసుకోవాలి. అయితే ఫాస్టాగ్ అనేది బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉంటే లేదా కొంత బ్యాలెన్స్ కలిగి ఉంటే మీరు సంబంధిత బ్యాంకుకు వెళ్లి మరొక ఫాస్ట్ట్యాగ్ని పొందాలి, దానిని వాహనంలో ఇన్స్టాల్ చేయాలి. మిగిలిన బ్యాలెన్స్ని పాత ఫాస్టాగ్ నుంచి కొత్తదానికి బదిలీ చేయాలి.
ప్రస్తుతం, ఫాస్ట్ట్యాగ్ సౌకర్యం దేశవ్యాప్తంగా ఉన్న 2000 టోల్ ప్లాజాలలో అందుబాటులో ఉంది. ఇది హైవేలు, రాష్ట్ర రహదారులను కవర్ చేస్తుంది. టోల్ ప్లాజాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫాస్టాగ్ల ద్వారా పార్కింగ్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దేశంలో 6.5 కోట్లకు పైగా ఫాస్ట్ట్యాగ్లు జారీ చేశారు. 2022లో, మొత్తం ఫాస్ట్ట్యాగ్ ఫీజు సేకరణ రూ. 50,855 కోట్లుగా నమోదైంది. 2021లో రూ. 34,778 కోట్ల సేకరణతో పోలిస్తే ఇది 46.20 శాతం భారీగా పెరిగింది. అదనంగా 2022లో 324 కోట్ల లావాదేవీలు జరగగా 2021లో 219 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి కాబట్టి ఫాస్ట్ట్యాగ్ లావాదేవీల సంఖ్య 48 శాతం పెరిగింది.