Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలీ ఖాతాలో రూ.221 కోట్లు జమ.. ఇంటికి ఐటీ నోటీసులు.. అసలు ఏం జరిగిందంటే..!

చేసేది కూలీ పని కానీ.. బ్యాంకు ఖాతాల్లోకి మాత్రం కోట్లాది రూపాయల డిపాజిట్‌.. ఓ కూలీ పని చేసుకునే వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. వందల కోట్ల రూపాయలు అతని ఖాతాలో డిపాజిట్‌ అయినట్లు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు..

కూలీ ఖాతాలో రూ.221 కోట్లు జమ.. ఇంటికి ఐటీ నోటీసులు.. అసలు ఏం జరిగిందంటే..!
Income Tax Notice
Follow us
Subhash Goud

|

Updated on: Oct 21, 2023 | 9:45 AM

చేసేది కూలీ పని కానీ.. బ్యాంకు ఖాతాల్లోకి మాత్రం కోట్లాది రూపాయల డిపాజిట్‌.. ఓ కూలీ పని చేసుకునే వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. వందల కోట్ల రూపాయలు అతని ఖాతాలో డిపాజిట్‌ అయినట్లు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఓ కార్మికుడి ఇంటికి ఆదాయపు పన్ను నోటీసు చేరడంతో కలకలం రేగింది. శివప్రసాద్ నిషాద్ అనే వ్యక్తి ఢిల్లీలో టైల్స్ గ్రైండింగ్‌లో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అతని ఖాతా నుంచి 221 కోట్ల రూపాయల లావాదేవీ జరిగింది. దీంతో షాక్ తిన్న అతను స్వగ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు.

221 కోట్ల విలువైన లావాదేవీలు:

ఆదాయపు పన్ను శాఖ నోటీసులో శివప్రసాద్ నిషాద్ బ్యాంకు ఖాతా నుంచి రూ.221 కోట్ల లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకుల్లో అతని పేరు మీద ఖాతాలు తెరవడం ద్వారా రూ.221 కోట్లు జమ అయ్యాయి. బస్తీలోని బటానియా గ్రామంలోని తన ఇంటికి ఆదాయపు పన్ను నోటీసు రావడంతో ఈ విషయం అతనికి తెలిసింది. ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం.. శివప్రసాద్ నిషాద్ బ్యాంక్ ఖాతాలో జమ అయిన మొత్తం రూ. 4.5 లక్షలకు పైగా (టిడిఎస్) తగ్గింపు గురించి ఐటి శాఖ నుండి నోటీసులో తెలియజేశారు. 2019లో పోయిన తన పాన్ కార్డును ఉపయోగించి ఎవరైనా తన పేరు మీద ఖాతాను తెరిచి ఉండవచ్చని శివప్రసాద్ అనుమానిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

శివప్రసాద్ తనకు తెలిసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించారు. తన కెనరా బ్యాంక్ ఖాతాలో రూ.300 ఉన్నట్లు శివప్రసాద్ తెలిపాడు. సెంట్రల్ బ్యాంక్ లాల్‌గంజ్ శాఖలో ఇది రూ.29,898. లాల్‌గంజ్ పోస్టాఫీసులో ఒక ఖాతా కూడా ఉంది. అందులో రెండు వేల రూపాయలు ఉన్నాయి. ఇది తప్ప అతనికి వేరే ఖాతా లేదు. ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలపై ఆదాయపు పన్ను, పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. ఏఎస్పీ దీపేంద్ర చౌదరి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బదిలీ అయిన ఖాతాలపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి