AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Traffic Rules: మీ వాహనానికి ఇన్సూరెన్స్‌ లేదా? అయితే మీ పని అయిపోయినట్లే.. కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు

New Traffic Rules: ఈ మార్పులన్నింటికీ సంబంధించిన ప్రతిపాదనను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపింది. తద్వారా అందరి అభిప్రాయం పొందవచ్చు. అన్ని సూచనలను పొందిన తర్వాత దానిని మంత్రివర్గానికి పంపుతారు. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత..

New Traffic Rules: మీ వాహనానికి ఇన్సూరెన్స్‌ లేదా? అయితే మీ పని అయిపోయినట్లే.. కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు
Subhash Goud
|

Updated on: Aug 05, 2025 | 8:10 AM

Share

New Traffic Rules: ఈ రోజుల్లో చాలా మంది తమ వాహనాన్ని ఇన్సూరెన్స్‌ గడువు ముగిసిన తర్వాత కూడా నడుపుతూనే ఉంటారు. ఇది ప్రమాదకరమైన ధోరణిగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో వాహనం ప్రమాదానికి గురైతే నష్టానికి పరిహారం ఉండదు. ఎవరికీ సహాయం లభించదు. ఇప్పుడు ప్రభుత్వం అటువంటి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మోటారు వాహన చట్టంలో పెద్ద మార్పులు:

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో కొన్ని అవసరమైన మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ద్వారా రోడ్డు భద్రత మెరుగుపడుతుంది. అలాగే నియమాలు కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా బీమా లేకుండా రోడ్లపై వాహనాలు నడిపే వారిపై ఉచ్చు బిగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

భారీ జరిమానా:

ఇప్పటివరకు ఎవరైనా బీమా లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే, మొదటిసారి రూ. 2,000, రెండవసారి రూ. 4,000 జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధన మారబోతోంది. కొత్త నిబంధన ప్రకారం.. మీరు మొదటిసారి పట్టుబడితే మీరు బీమా ప్రాథమిక ప్రీమియం మొత్తానికి మూడు రెట్లు వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అదే సమయంలో మీరు మళ్ళీ అలా చేస్తే, మీరు ఐదు రెట్లు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం సులభంగా పొందగలిగేలా రోడ్లపై బీమా లేని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!

వేగ పరిమితికి సంబంధించి నియమాలు:

ప్రస్తుతం దేశంలో వేగ పరిమితి గురించి చాలా గందరగోళం ఉంది. చాలా సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు నియమాలను అమలు చేస్తాయి. దీని కారణంగా ప్రజలు ఎక్కడ, ఏ వేగంతో డ్రైవ్ చేయాలో అర్థం చేసుకోలేరు. చాలా సార్లు చలాన్ తెలియకుండానే జారీ చేయనున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వేగ పరిమితిని నిర్ణయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర రహదారులు, స్థానిక రహదారుల వేగ పరిమితిని నిర్ణయిస్తాయి. ఇది డ్రైవర్లు సమాచారం పొందడం సులభతరం చేస్తుంది. అనవసరమైన చలాన్‌లను కూడా నివారిస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు మరింత కఠినం:

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా కొత్త నియమాలు రాబోతున్నాయి. ఎవరైనా అతివేగం లేదా మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన నేరాలలో పట్టుబడితే, వారు మళ్ళీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే ముందు డ్రైవింగ్ పరీక్ష రాయవలసి ఉంటుంది. దీనితో పాటు 55 ఏళ్లు పైబడిన వ్యక్తులు లైసెన్స్ పునరుద్ధరించుకునేటప్పుడు తాము ఇప్పటికీ సురక్షితంగా వాహనం నడపగలమని నిరూపించుకోవాలి. దీని కోసం వారు మరోసారి డ్రైవింగ్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది.

ఈ మార్పులన్నింటికీ సంబంధించిన ప్రతిపాదనను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపింది. తద్వారా అందరి అభిప్రాయం పొందవచ్చు. అన్ని సూచనలను పొందిన తర్వాత దానిని మంత్రివర్గానికి పంపుతారు. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ఈ కొత్త నియమాలు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక నుంచి మీరు వాహనం నడుపుతుంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ముఖ్యంగా బీమా, వేగ పరిమితి, లైసెన్స్ విషయంలో లేకపోతే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.

ఇది కూడా చదవండి: Maruti Car: అత్యంత చౌకైన ఈ కారు ధర రూ. 4.23 లక్షలు.. 6 ఎయిర్‌ బ్యాగులు!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి