AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Sim Card Rules: ఇక ఇలా చేయకుంటే సిమ్‌కార్డు పొందలేరు.. కొత్త నిబంధనలు!

New Sim Card Rules: కొత్త విధానం వల్ల అతిపెద్ద ప్రభావం ప్రీపెయిడ్ వినియోగదారులపై ఉంటుంది. వారు ఇకపై కేవైసీ లేకుండా సిమ్‌ కార్డులను పొందలేరు. ఈ ప్రక్రియ కొంచెం తక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ఇది భద్రత, నమ్మకాన్ని పెంచుతుంది. ఇప్పటి..

New Sim Card Rules: ఇక ఇలా చేయకుంటే సిమ్‌కార్డు పొందలేరు.. కొత్త నిబంధనలు!
Subhash Goud
|

Updated on: Jun 20, 2025 | 9:56 PM

Share

భారత ప్రభుత్వం ఇటీవల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మొబైల్ నంబర్లు, వ్యాపార కాల్‌లకు KYCని తప్పనిసరి చేసింది. టెలికాం రంగంలో పారదర్శకత, భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Luxurious Prisons: ప్రపంచంలోని ఈ 7 జైళ్లలో ఖైదీలకు లగ్జరీ హోటల్‌ సదుపాయాలు

కొత్త మార్గదర్శకాలు

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ప్రకారం, ఇప్పుడు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ అయినా అన్ని మొబైల్ నంబర్‌లకు KYC ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. గతంలో ప్రీపెయిడ్ వినియోగదారులకు కేవైసీ సౌలభ్యం ఉండేది. ఇక్కడ వారు పూర్తి కేవైసీ లేకుండా కూడా సిమ్ కార్డులను పొందవచ్చు. కానీ ఇప్పుడు అలా కుదరదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు వారి గుర్తింపు, చిరునామా రుజువుతో కేవైసీని పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్‌లో (టెలికాం స్టోర్లలో) లేదా ఆన్‌లైన్‌లో (టెలికాం కంపెనీల వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల ద్వారా) పూర్తి చేయవచ్చు.

ఈ నిర్ణయం ఎందుకు..?

భద్రత, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవైసీ లేకుంటే ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్, మోసం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అణిచివేస్తుంది. దీనితో పాటు, అన్ని మొబైల్ నంబర్లు నమోదిత వినియోగదారులకు అనుసంధానించబడి ఉన్నాయని నిర్ధారిస్తుంది. దీనివల్ల అత్యవసర సేవలు, ప్రభుత్వ పథకాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

కొత్త నిబంధనల ప్రభావం

కొత్త విధానం వల్ల అతిపెద్ద ప్రభావం ప్రీపెయిడ్ వినియోగదారులపై ఉంటుంది. వారు ఇకపై కేవైసీ లేకుండా సిమ్‌ కార్డులను పొందలేరు. ఈ ప్రక్రియ కొంచెం తక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ఇది భద్రత, నమ్మకాన్ని పెంచుతుంది. ఇప్పటికే KYC పూర్తి చేసిన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఇబ్బంది ఉండదు. అయితే, వారు ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌డేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. KYC ఎలా చేయాలి? కేవైసీని పూర్తి చేయడానికి సిమ్‌ కార్డు దారులు గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటరు ఐడి వంటివి) అందించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Google, Apple: ప్రమాదంలో 16 బిలియన్ల మంది గూగుల్‌, ఆపిల్‌ వినియోగదారులు.. ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్‌!

ఇది కూడా చదవండి: Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో ఇలాంటి కీటకాలు వస్తున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో పరార్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి