Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maldives: భారతీయులెవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లకుంటే ఆ దేశానికి ఎంతన నష్టమో తెలుసా?

భారతీయులు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం మాల్దీవులకు సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. దీని ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. భారతీయులెవరూ మాల్దీవులకు వెళ్లకపోతే ఏమవుతుంది ? టైమ్స్ ఆల్జీబ్రా మాజీ పోస్ట్‌లో ఆసక్తికరమైన సమాచారం అందించింది. దాని ప్రకారం భారతీయులు మాల్దీవులను బహిష్కరిస్తే ఆ దేశానికి రోజుకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లుతుంది..

Maldives: భారతీయులెవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లకుంటే ఆ దేశానికి ఎంతన నష్టమో తెలుసా?
Maldives
Follow us
Subhash Goud

|

Updated on: Jan 17, 2024 | 9:56 AM

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత మాల్దీవులు, భారత్‌ల మధ్య విభేదాలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు నరేంద్ర మోదీపై, భారత్‌పై జోకులు వేయడంతో చాలా మంది భారతీయులు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం మాల్దీవులకు సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. దీని ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. భారతీయులెవరూ మాల్దీవులకు వెళ్లకపోతే ఏమవుతుంది ? టైమ్స్ ఆల్జీబ్రా మాజీ పోస్ట్‌లో ఆసక్తికరమైన సమాచారం అందించింది. దాని ప్రకారం భారతీయులు మాల్దీవులను బహిష్కరిస్తే ఆ దేశానికి రోజుకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లుతుంది.

‘బిగ్ న్యూస్, రిపోర్టు ప్రకారం.. భారతీయులు మాల్దీవులకు వెళ్లడం మానేస్తే, మాల్దీవులకు రోజుకు రూ.9 కోట్ల నష్టం. భారతీయులు బహిష్కరిస్తే 44,000 మాల్దీవుల కుటుంబాలు నష్టపోతాయని ట్రావెల్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. చాలా మంది ప్రముఖుల ప్రచారం తర్వాత భారతీయులు ఇప్పుడు మాల్దీవులకు బదులుగా భారతీయ ద్వీప ప్రాంతాలకు వెళ్లడానికి ఎంచుకుంటున్నారు’ అని టైమ్స్ ఆల్జీబ్రా ఎక్స్ పోస్ట్ రాసింది.

మాల్దీవులకు పర్యాటకులు ముఖ్యం

ఇవి కూడా చదవండి

300 కంటే ఎక్కువ చిన్న ద్వీపాల సమూహమైన మాల్దీవులకు పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు. చైనా మినహా మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు భారతీయులే. అలా భారతీయ పర్యాటకులు రావడం మానేస్తే మాల్దీవులు చాలా నష్టపోవడం సహజం. రోజుకు రూ.9 కోట్ల నష్టం అంటే మాల్దీవుల చేతిలో ఏడాదికి రూ.3 నుంచి 4 వేల కోట్ల ఆదాయం పోతుంది.

అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ నేతృత్వంలోని మాల్దీవుల్లోని పాలక పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యతిరేక, చైనా అనుకూల విధానాన్ని కలిగి ఉంది. అదే ఎజెండాతో మొయిజు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. వాస్తవానికి అతను చైనా అనుకూల వైఖరిని అవలంభిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి మాల్దీవుల్లో ఉన్న భారత ఆర్మీ యూనిట్లను వెనక్కి వెళ్లమని మొయిజు చెబుతూనే ఉన్నారు. బహిరంగంగానే చైనా వైపు మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి