Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Frauds: 9 నెలల్లో రూ.107.21 కోట్ల సైబర్‌ మోసాలు.. దుండగులకు ఉచ్చు బిగించే విధానం ఇదే!

Cyber Frauds: డేటా ప్రకారం.. ఈ సైబర్ మోసం ముఖ్యంగా డెబిట్/క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన మోసాల కేసులలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం సైబర్ మోసానికి సంబంధించిన అన్ని డేటా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద లేనప్పటికీ, బ్యాంకులు..

Cyber Frauds: 9 నెలల్లో రూ.107.21 కోట్ల సైబర్‌ మోసాలు.. దుండగులకు ఉచ్చు బిగించే విధానం ఇదే!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 15, 2025 | 9:03 PM

ఒకవైపు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ వేగంగా పెరుగుతుంటే, మరోవైపు సైబర్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైబర్ మోసం కేసులు, దాని వల్ల కలిగే నష్టాలకు సంబంధించి లోక్‌సభలో నివేదిక వెల్లడైంది. లోక్‌సభలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) మొదటి మూడు త్రైమాసికాల్లో సైబర్ మోసానికి సంబంధించిన 13,384 కేసులు నమోదయ్యాయి. దీని వలన భారతీయులకు దాదాపు రూ.107.21 కోట్ల నష్టం వాటిల్లింది.

ప్రతి సంవత్సరం 1 లక్ష సైబర్ మోసం కేసులు:

డేటా ప్రకారం.. ఈ సైబర్ మోసం ముఖ్యంగా డెబిట్/క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన మోసాల కేసులలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం సైబర్ మోసానికి సంబంధించిన అన్ని డేటా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద లేనప్పటికీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థల గణాంకాలు ప్రతి సంవత్సరం రూ. లక్ష కంటే ఎక్కువ మోసం కేసులు పెరుగుతున్నాయని చూపిస్తున్నాయి.

ఈ కేసులే ఎక్కువ:

డేటా ప్రకారం, KYC లేని ఖాతాలు, మనీ మ్యూల్స్ (మోసం కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు), ఫిషింగ్ దాడుల కేసులు వేగంగా పెరిగాయి. ఫలితంగా సైబర్ మోసం కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.177.05 కోట్లకు చేరుకుంది. అయితే 2015 సంవత్సరంలో కేవలం 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని ఫలితంగా మొత్తం రూ.18.46 కోట్ల నష్టం వాటిల్లింది.

సైబర్ మోసాలను ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?

  • సైబర్ మోసాన్ని అరికట్టడానికి RBI జూలై 2024లో ‘ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్’ మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీనిలో అనేక కఠినమైన నియమాలు రూపొందించింది.
  • అనుమానాస్పద లావాదేవీలను పర్యవేక్షించడానికి ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ (EWS) ప్రవేశపెట్టింది.
  • KYC నిబంధనలకు అనుగుణంగా లేని, అధిక-రిస్క్ ఖాతాల కఠినమైన పరిశీలన.
  • మోసాల నమూనాలను విశ్లేషించడానికి ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ ఏర్పాటు

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి