Sugar Production: దేశంలో తగ్గనున్న చక్కెర ఉత్పత్తి.. కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం..!

గతేడాది కంటే ఈ ఏడాది దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దాని ఎగుమతిని నిషేధించవచ్చు. వచ్చే ఏడాది 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ద్రవ్యోల్బణం..

Sugar Production: దేశంలో తగ్గనున్న చక్కెర ఉత్పత్తి.. కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం..!
Sugar

Updated on: Apr 29, 2023 | 5:14 PM

గతేడాది కంటే ఈ ఏడాది దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దాని ఎగుమతిని నిషేధించవచ్చు. వచ్చే ఏడాది 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

ప్రస్తుత 2022-23 చక్కెర సీజన్ సంవత్సరంలో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 327 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. గతేడాది ఇదే కాలంలో చక్కెర ఉత్పత్తి 359 లక్షల టన్నులు.

మంత్రుల కమిటీ సిఫార్సు

ఈ విషయంలో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు నివేదించాయి. తక్షణ ప్రభావంతో చక్కెర మిల్లుల ఎగుమతి పంపకాన్ని నిలిపివేయాలని కమిటీ సూచించింది.

ఇవి కూడా చదవండి

ఈ మంత్రుల కమిటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. పీయూష్ గోయల్ ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, సరఫరా మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తున్నారు. కమిటీ తాజా సమావేశం ఏప్రిల్ 27న జరిగింది.

త్వరలో నోటిఫికేషన్ విడుదల:

చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దేశీయ డిమాండ్‌కు సరిపడా చక్కెర నిల్వలు దేశంలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈ ఏడాది దేశంలో చక్కెర డిమాండ్ 275 లక్షల టన్నులుగా అంచనా. 327 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం దేశంలో చక్కెర రిటైల్ ధర కిలోకు రూ.42.24గా ఉంది. ఏడాది క్రితం దీని ధర కిలో రూ.41.31 వరకు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us