AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం తగ్గుతుంది.. మస్త్ పైసల్ ఆదా..

బండి బయటకు తీయాలంటేనే భయమేస్తోంది.. పెట్రోల్ బంకుకు వెళ్తే జేబు ఖాళీ అవుతోంది. కానీ మీకు తెలుసా? మనం పోయించుకునే పెట్రోల్ అసలు ధర కంటే పన్నులే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ పెట్రోల్, డీజిల్ గనుక జీఎస్టీ పరిధిలోకి వస్తే.. సామాన్యుడికి లీటరుకు రూ. 30 నుంచి రూ.40 వరకు ఆదా అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం తగ్గుతుంది.. మస్త్ పైసల్ ఆదా..
How Much Can We Save If Petrol Comes Under Gst
Krishna S
|

Updated on: Apr 06, 2026 | 3:02 PM

Share

ప్రతిరోజూ పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. లీటరు సెంచరీ దాటి దూసుకుపోతుంటే.. అసలు ఈ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? పెట్రోల్ బేస్ ధర కేవలం రూ. 55 ఉంటే, మన దగ్గరకు వచ్చేసరికి రూ. 100 ఎందుకు అవుతోంది? ఒకవేళ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే నిజంగానే ధరలు తగ్గుతాయా? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. నిజానికి మనం పోయించుకునే పెట్రోల్ ధరలో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ వంటి నగరంలో పెట్రోల్ బేస్ ధర లీటరుకు సుమారు రూ.55 మాత్రమే. కానీ దీనికి కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను, డీలర్ కమీషన్ వంటివి కలిపిన తర్వాత మనకు లీటరు ధర రూ.100 దాటుతోంది. అంటే అసలు ధర కంటే పన్నుల రూపంలోనే మనం ఎక్కువ చెల్లిస్తున్నాం.

ఒకవేళ 12శాతం జీఎస్టీ విధిస్తే?

పెట్రోల్‌పై ప్రస్తుతమున్న రకరకాల పన్నులను తీసివేసి, కేవలం 12శాతం జీఎస్టీ మాత్రమే అమలు చేస్తే సీన్ మొత్తం మారిపోతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.68 – రూ.70కి తగ్గుతుంది. అంటే ఇప్పుడున్న ధర కంటే దాదాపు రూ.30 వరకు ఆదా అవుతుంది. డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.67 – రూ.68కి చేరుతుంది. ఇది సామాన్య రవాణా రంగానికి పెద్ద ఊరట.

ఒకవేళ 28శాతం

ఒకవేళ ప్రభుత్వం అత్యధిక స్లాబ్ అయిన 28శాతం జీఎస్టీని అమలు చేసినా సరే.. మనకు లాభమే ఉంటుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.75 – రూ.80 మధ్య ఉంటుంది. ఇది కూడా ప్రస్తుత ధరల కంటే చాలా తక్కువే. ఇక డీజిల్ ధర సుమారు రూ.72 – రూ.75 వద్ద ఉంటుంది.

జీఎస్టీ వల్ల ధరలు ఎందుకు తగ్గుతాయి?

ప్రస్తుత విధానంలో పన్ను మీద పన్ను పడుతోంది. అంటే కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకంతో కలిపి ఉన్న మొత్తంపై రాష్ట్రాలు మళ్లీ వ్యాట్ వేస్తున్నాయి. కానీ జీఎస్టీ అనేది సింగిల్ టాక్స్ విధానం. దీనివల్ల పన్ను భారం తగ్గి, సామాన్యుడికి లబ్ధి చేకూరుతుంది.

మరి ఎందుకు జీఎస్టీలో చేర్చడం లేదు?

ప్రయోజనాలు ఇంత స్పష్టంగా ఉన్నా, ఇంధనాన్ని జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆదాయం. పెట్రోల్, డీజిల్‌పై వచ్చే వ్యాట్ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు. దీన్ని జీఎస్టీలో కలిపేస్తే తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని, కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందని రాష్ట్రాలు భయపడుతున్నాయి.

Follow Us
ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం..
ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం..
ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం
ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం
చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్
చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..