AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindustan Unilever: HUL నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. రూ.19 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..

FMCG రంగ దిగ్గజం HUL తన మార్చి త్రైమాసిక ఫలితాలను ( Q4 Result) విడుదల చేసింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ లాభం రూ. 2,327 కోట్లుగా ఉంది...

Hindustan Unilever: HUL నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. రూ.19 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..
Hul
Srinivas Chekkilla
|

Updated on: Apr 28, 2022 | 8:00 AM

Share

FMCG రంగ దిగ్గజం HUL తన మార్చి త్రైమాసిక ఫలితాలను ( Q4 Result) విడుదల చేసింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ లాభం రూ. 2,327 కోట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,143 కోట్ల లాభంతో పోలిస్తే 8.58 శాతం ఎక్కువ. ET ప్రకారం, నిపుణుల అంచనాల కంటే ఈ సంఖ్య మెరుగ్గా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం లాభం రూ. 2,180 కోట్లుగా అంచనా వేశారు. దీనితో పాటు బోర్డు తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్ ప్రకటించింది. అదే సమయంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం 5.34 శాతం పెరిగి రూ.2,307 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయం ద్వారా కంపెనీ ఆదాయం 10.4 శాతం పెరిగి రూ.13,190 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.11,947 కోట్లుగా ఉంది.

మార్కెట్ వృద్ధి కంటే ముందున్నప్పటికీ వాల్యూమ్ వృద్ధి గత ఏడాది స్థాయిలోనే ఉందని హెచ్‌యుఎల్ పేర్కొంది. అదే సమయంలో కంపెనీ విలువ, వాల్యూమ్ రెండింటి ఆధారంగా తన మార్కెట్ వాటాను నిరంతరం పెంచుతోంది. కమోడిటీ ధరలు బాగా పెరిగినప్పటికీ, ఈ త్రైమాసికంలో EBITDA మార్జిన్లు 24.6 శాతంగా ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య కంపెనీ నిరంతరం పొదుపుపై​దృష్టి సారిస్తు్న్నామని కంపెనీ తెలిపింది. తమ హోమ్ కేర్ విభాగంలో 24 శాతం, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగంలో 4 శాతం, ఫుడ్ అండ్ రిఫ్రెష్‌మెంట్ 5 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకారం, త్రైమాసికంలో, ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ, పానీయాలు, ఆహారాలు, ఐస్ క్రీమ్ సెగ్మెంట్ బాగానే ఉంది.

ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో పెద్ద ఆందోళన కలిగిస్తుందని HUL MD, CEO సంజీవ్ మెహతా అన్నారు. ఇది మార్కెట్ వృద్ధిని తగ్గిస్తుందని చెప్పారు. దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి, రుతుపవనాల సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముగుస్తుందని అంచనా వేసినట్లయితే మధ్యకాలంలో ధరల తగ్గుదల అవకాశాలు పెరుగుతాయన్నారు.

Read Also.. LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..