HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

|

Apr 24, 2021 | 10:07 AM

HDFC Bank: ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..
Hdfc Bank
Follow us on

HDFC Bank: ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే తమ కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకూడదని.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ ఏటీఎం సేవలు ఆవిష్కరించింది. ఈ సేవలు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ స్పష్టం చేసింది. అలాగే హైదరాబాద్ సహా దేశంలో ఉన్న 19 ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా.. స్థానిక సంస్థలతో చర్చించి మొబైల్ ఏటీఎంలు ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలో నిర్ణయం తీసుకోనుంది.

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో పలు రాష్ట్రాలు స్వయంగా లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా బ్యాంకులు పని వేళలకు సంబంధించి పలు సూచనలు చేసింది. వర్కింగ్ అవర్స్ తగ్గించుకోవాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే ఓపెన్ ఉంటాయి. అలాగే ఈ మొబైల్ ఏటీఎంల వలన కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వినియోగదారులు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలేదు. మీరు ఉంటున్న ప్రదేశానికే ఏటీఎం వస్తుంది.

Aslso Read: PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…