AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Schemes: ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అద్భుతమైన స్కీమ్స్‌

మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్రమే కాదు, దాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న పొదుపు పథకం ఈ పనిలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ డబ్బును సురక్షితంగా పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ రోజు 3 అటువంటి..

Best Schemes: ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అద్భుతమైన స్కీమ్స్‌
Cash
Subhash Goud
|

Updated on: Apr 11, 2024 | 10:56 AM

Share

మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్రమే కాదు, దాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న పొదుపు పథకం ఈ పనిలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ డబ్బును సురక్షితంగా పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ రోజు 3 అటువంటి స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి ఇటీవల పెట్టుబడిదారుల పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేశాయి.

  1. కిసాన్ వికాస్ పత్ర: ఈ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ స్కీలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దానిని కొన్ని సంవత్సరాలలో రెట్టింపు చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000. గరిష్టపెట్టుబడికి పరిమితి లేదు. ఇది ఏకమొత్తం పెట్టుబడి పథకం. అంటే ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టి వదిలేయవచ్చు. మీరు మళ్లీ మళ్లీ వాయిదాలలో డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు పెడుతున్న పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 115 నెలలు అంటే 9 సంవత్సరాల 7 నెలలు. మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, ఈ సమయం తర్వాత మీ మొత్తం రూ. 10 లక్షలకు పెరుగుతుంది. అయితే, మీరు రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తం రూ. 8 లక్షలకు పెరుగుతుంది.
  2. పీపీఎఫ్‌ స్కీమ్‌: పీపీఎఫ్‌పై వడ్డీ రేట్లు 7.1 శాతం, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతంగా ఉంచారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయడంలో సహాయపడుతుంది. ఈ పథకం పన్ను ఆదాలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో 72 నియమం ప్రకారం, మీ డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం పడుతుంది.
  3. సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్ చేసిన మొత్తంపై 8.2 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో పోస్టాఫీసు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి (SSY) అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం చదువు, పెళ్లి ఖర్చులకు తోడ్పడుతుంది. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు అందుబాటులో ఉంది. పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి