పన్ను చెల్లింపుదారులకు శుభవార్త..ఐటీ రిటర్నులకు గడువు పెంపు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు మోదీ ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు మోదీ ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2018–19, 2019–20 ఫైనాన్షియల్ ఇయర్స్ కు సంబంధించి డెడ్లైన్ ను జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ప్రెస్నోట్ రిలీజ్ చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది.
2018–19 ఏడాదికి గాను రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా.. దాన్ని జులై 31 కి పెంచిన కేంద్రం మరోవైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింకు చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఇది వరకు ప్రకటించిన డెడ్లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31లో ఈ రెండు కార్డులను లింక్ చేసుకోవాలని, లేకపోత రూ. 10వేల జరిమానా పడుతుందని ప్రభుత్వం తెలిపింది.