
హిందూజా గ్రూప్ చైర్మన్, భారత సంతతికి చెందిన బిలియనీర్ గోపీచంద్ పి. హిందూజా బుధవారం లండన్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. నలుగురు హిందూజా సోదరులలో పెద్దవాడైన గోపీచంద్ పి. హిందూజా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడైన రేంజర్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.
వ్యాపార రంగంలో ఆయనను “జీపీ” అని పిలుస్తారు. ఆయన భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. రెండవ తరం హిందూజా కుటుంబ సభ్యుడైన గోపీచంద్ తన అన్నయ్య శ్రీచంద్ మరణం తర్వాత మే 2023లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. నవంబర్ 5,6 తేదీల్లో పాఠశాలలు బంద్!
గోపీచంద్ హిందూజా ఎవరు?
UK సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం..జీపీ హిందూజా వరుసగా ఏడు సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్లో అత్యంత ధనవంతుడు. 1940 లో భారతదేశంలో జన్మించిన ఆయన హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే 2023లో తన సోదరుడు శ్రీచంద్ హిందూజా చిత్తవైకల్యంతో మరణించిన తర్వాత గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
గోపీచంద్ హిందూజా 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందాడు. లండన్లోని రిచ్మండ్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ను కూడా పొందాడు. హిందూజా కుటుంబ వ్యాపారాన్ని మొట్టమొదట 1914లో జి.పి. హిందూజా తండ్రి పరమానంద్ హిందూజా స్థాపించారు. ఆయనే స్థాపకుడు కూడా. గోపీచంద్ హిందూజా, ఆయన సోదరుడు శ్రీచంద్ హిందూజా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి నేడు బిలియన్ డాలర్ల సమ్మేళనంగా మార్చారు.
ఇది కూడా చదవండి: PAN Card: డిసెంబర్ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్ కార్డు డీయాక్టివేట్!
పిచంద్ హిందూజా ఫ్యామిలీ నెట్వర్త్:
పిచంద్ హిందూజా కుటుంబం బ్రిటన్లో అత్యంత ధనవంతులుగా నివేదించబడింది. ఫోర్బ్స్ రియల్-టైమ్ నెట్ వర్త్ ప్రకారం.. మంగళవారం నాటికి హిందూజా కుటుంబం నికర విలువ $20.6 బిలియన్లు లేదా దాదాపు రూ.182,668 కోట్లు. హిందూజా కుటుంబం లండన్లో రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉంది. వాటిలో వైట్హాల్లోని చారిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ భవనంలో ఉన్న రాఫెల్స్ లండన్ హోటల్ కూడా ఉంది.హిందూజా గ్రూప్ ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్కేర్, రియల్ ఎస్టేట్, పవర్, మీడియా, వినోదం వంటి 11 రంగాలలో పనిచేస్తుంది. దాని ప్రసిద్ధ బ్రాండ్లలో అశోక్ లేలాండ్., ఇండస్ఇండ్ బ్యాంక్, నెక్స్ట్డిజిటల్ లిమిటెడ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్ కట్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి