PM Kisan: రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ప్రతినెలా అకౌంట్లోకి రూ.3 వేలు..

|

Jul 22, 2021 | 8:01 AM

అన్నదాతల కోసం కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా నేరుగా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.

PM Kisan: రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ప్రతినెలా అకౌంట్లోకి రూ.3 వేలు..
Pmkmy
Follow us on

అన్నదాతల కోసం కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా నేరుగా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 6 వేలు జమ చేస్తుంది కేంద్రం. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడతల వారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అంటే రూ.2 వేల చొప్పున రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి. దీంతో దేశంలోని చాలా మంది రైతులకు ఆర్థికంగా కాస్త ఊరట కలగనుంది.

ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మాత్రమే కాకుండా.. రైతుల కోసం కేంద్రం మరిన్ని స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీ్మ్ కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. అంటే 12 నెలలకు కలిపితే.. సంవత్సరానికి రూ. 36 వేలు ఈ పథకం ద్వారా రైతులకు అందుతాయి. అయితే ఈ డబ్బులు పథకంలో చేరిన వారికి మాత్రమే లభిస్తాయి. అంతేకాకుండా.. 60 ఏళ్లు దాటిన రైతులకు నెలవారీ పెన్షన్ రూపంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ పథకంలో నమోదు చేసుకున్న రైతులు ఇందులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు రెండు హెక్టార్లలోపు సాగు భూమిని కలిగి ఉండాలి. ఇందులో చేరడానికి ప్రత్యేకంగా ఎలాంటి సర్టిఫికేట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. నెలకు రూ. 55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రతిపాదికన మీరు చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. ఎం కిసాన్ డబ్బుల నుంచి పీఎం కిసాన్ మాన్‌ధన్ డబ్బులు చెల్లించొచ్చు. ఆటోమేటిక్‌గానే బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతాయి.

Also Read: వెండితెరపైకి సుప్రిత ?.. అసలు విషయం చెప్పిన సురేఖ వాణి.. ఇంతకీ మ్యాటరెంటంటే..

మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..