AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి ధరల్లో అప్‌ అండ్‌ డౌన్స్‌..! మరి ఇప్పుడే కొనాలా వద్దా? నిపుణుల క్లారిటీ

గత కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జల్గావ్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగి కిలోకు రూ.1.70 లక్షలు దాటాయి. బంగారం ధరలు కూడా పెరిగాయి. నిపుణుల ప్రకారం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరగవచ్చు.

బంగారం, వెండి ధరల్లో అప్‌ అండ్‌ డౌన్స్‌..! మరి ఇప్పుడే కొనాలా వద్దా? నిపుణుల క్లారిటీ
Gold And Silver
SN Pasha
|

Updated on: Nov 28, 2025 | 6:00 AM

Share

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు బంగారం ధర బాగా తగ్గుతోంది. కొన్ని సార్లు భారీగా పెరుగుతోంది. బులియన్ మార్కెట్లో గురువారం భారీ పెరుగుదల కనిపించింది. జల్గావ్ బులియన్ మార్కెట్ మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బంగారం అత్యున్నత నాణ్యత కలిగినదిగా పరిగణిస్తారు. బంగారంతో పాటు, జల్గావ్‌లో వెండి ధర గణనీయంగా పెరిగింది. గత 24 గంటల్లో వెండి ధర ఏకంగా రూ.6,500 పెరిగింది.

ఈ ధర పెరుగుదలతో వెండి ధర ఇప్పుడు GSTతో సహా కిలోకు రూ.1 లక్ష 70 వేల 980కి చేరుకుంది. మరోవైపు బంగారం ధర కూడా రూ.800 పెరిగింది. ఈ ధర పెరుగుదలతో బంగారం ధర GSTతో సహా పది గ్రాములకు రూ.1 లక్ష 29 వేల 574కి చేరుకుంది. గురువారం బంగారం ధర కంటే వెండి ధర ఎక్కువగా పెరిగింది. ఒక నెల తర్వాత వెండి ధర మళ్ళీ 1 లక్ష 70 వేల మార్కును దాటింది. కాబట్టి భవిష్యత్తులో బంగారం కంటే వెండి ధర పెరుగుతుందా అనే డౌట్‌ చాలా మందిలో ఉంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అందువల్ల బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ బంగారం, వెండిని కొనాలనుకుంటున్నవారు.. ధరలు కాస్త ఎక్కువే అనిపించినా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, సమీప భవిష్యత్తులో ఇప్పటి ధరలకు మరో 15, 20 శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

గమనిక: ఇది పూర్తిగా నిపుణుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ధరల పెరుగుల అనేది అంచనా మాత్రమే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి