AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!

Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని పేవాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనే తన ప్రణాళికలను వెల్లడించారు. దీంతో ఇకపై ట్విట్టర్ ఫీగా అందరికీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది.

Twitter: ట్విట్టర్ ఉచిత సేవలకు కాలం చెల్లిందా? ఇకపై ట్వీట్ చేయాలంటే పైసలు కట్టాల్సిందే..!
Elon Musk
Ayyappa Mamidi
|

Updated on: May 04, 2022 | 5:39 PM

Share

Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని పేవాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనే తన ప్రణాళికలను వెల్లడించారు. దీంతో ఇకపై ట్విట్టర్ ఫీగా అందరికీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ కింద ట్విట్టర్ సేవల్లో అనేక మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, “సాధారణ వినియోగదారుల” కోసం ట్విట్టర్ ఎల్లప్పుడూ ఉచితమేనని మస్క్ స్పష్టం చేశారు. కానీ వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు ట్విట్టర్ వినియోగించుకుంటున్నందుకు స్వల్ప ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అత్యుత్తమైన సేవలను ఉచితంగా అందించటం వల్ల కంపెనీకి ఉపయోగం లేకుండా చేస్తున్నాయని.. అందువల్ల ట్విట్టర్ వినియోగించుకుంటున్నందుకు కొంత రుసుమును ప్రవేశ పెడుతున్నట్లు ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో అన్నారు.

Twitter ఫీ-ఆధారిత చందా ఆలోచనకు పూర్తిగా కొత్తది కాదని.. Twitter బ్లూ అనేది ఇదే విధమైన సేవ అన్నారు. Twitter బ్లూ అనేది అత్యంత విశ్వసనీయమైన కస్టమర్లకు ప్రీమియం ఫీచర్‌లకు, యాప్ కస్టమైజేషన్ చిన్న నెలవారీ సభ్యత్వ రుసుముతో అందుబాటులో ఉంది. US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వెబ్ కోసం Twitter బ్లూ iOS, Android, వెబ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ట్విటర్ బ్లూ తన చెల్లింపు కస్టమర్లకు ప్రత్యేకమైన ఫీచర్లను అందజేస్తుండగా.. వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారుల కోసం ప్రాథమిక ప్లాట్‌ఫారమ్ ఫీజు ఆధారితంగా ఉపయోగించడాన్ని మస్క్ సూచిస్తున్నారు. ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో ‘Maybe’ అనే పదాన్ని వినియోగించటం వల్ల ఈ ఆలోచన అమలుకు ఎంతవరకు కుదురుతుంది అనే దాని ప్రకారం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఒప్పందం చేసుకున్న తరుణంలో సోషల్ మీడియా దిగ్గజం భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ట్విట్టర్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వైపు మస్క్ ఉచిత ట్విట్టర్‌ సేవలను ముగించాలనుకుంటున్నట్లు అనిపిస్తోంది. కానీ మరోవైపు అతను ‘సముచిత’ ప్రేక్షకులకు మించి ట్విట్టర్ పరిధిని విస్తరించాలనుకుంటున్నారు. ట్విట్టర్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని అనుకుంటున్నట్లు న్యూయార్క్‌లోని వార్షిక మెట్ గాలాలో గతంలో అన్నారు. దీనిలో ఎక్కువ మంది అమెరికన్లు పాల్గొనాలని, వీలైనంత విశ్వసనీయంగా ట్విట్టర్ సేవలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మస్క్ అన్నారు.

ఇవీ చదవండి..

Stock Market: వడ్డీ రేట్ల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు.. 1307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

RBI Governor: సామాన్యులకు షాకిచ్చిన ఆర్బీఐ.. వడ్డీరేట్లు భారీగా పెంపు.. ప్రియం కానున్న ఆ ధరలు..