e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు

|

Jan 17, 2022 | 1:29 PM

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు

e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు
Follow us on

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ ఇశ్రమ్ వెబ్‌సైట్ తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకున్న వారికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 20 కోట్ల అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు ఈ-శ్రమ్‌ ప్లాట్‌ఫామ్‌ తెలిపింది. దీనిని సెప్టెంబర్‌ 2021లో ప్రారంభించారు. అసంఘటి రంగానికి చెందిన 16 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

వివరాలు సరిగ్గా లేకుంటే కార్డు రద్దు..

కాగా, ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. పాన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు అందించాలి. ఒకవేళ వివరాలు సరిగ్గా లేనట్లయితే రిజిస్టేషన్‌ రద్దు అవుతుంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా..?

ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. దీని తరువాత మీరు ఆధార్‌తో లింక్ చేయబడిన నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ప్రక్రియను కొనసాగించాలి. మీ సమాచారం తెరపైకి వస్తుంది. మీరు దానిని అంగీకరించాలి.

మీరు సులభంగానే ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఉంటే సరిపోతుంది. సులభంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూఏఎన్ నెంబర్ వస్తుంది.

తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

 


ఇవి కూడా చదవండి:

Pension Increase: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నెలవారీ పెన్షన్‌ రూ.9000కు పెరగనుందా..?

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!