Domestic Air Traffic: భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య.. డేటా విడుదల చేసిన డీజీసీఏ

Domestic Air Traffic: ఇండిగో మే నెలలో అత్యధిక ఆన్-టైమ్ పనితీరును 84 శాతంగా అందించింది. ఆరు కీలక విమానాశ్రయాల నుండి 79.7 శాతం ఒటెపెని (OTP)ని పొందిన ఎయిర్ ఇండియా తర్వాతి స్థానంలో ఉంది. ఆ ఆరు విమానాశ్రయాలు ఢిల్లీ..

Domestic Air Traffic: భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య.. డేటా విడుదల చేసిన డీజీసీఏ

Updated on: Jun 26, 2025 | 1:14 PM

గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే మే నెలలో భారతదేశ దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 1.89 శాతం పెరిగి 14.05 మిలియన్లకు చేరుకుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. డీజీసీఏ (DGCA) నెలవారీ డేటా ప్రకారం.. మే 2024లో భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణించిన దేశీయ ప్రయాణికుల సంఖ్య 13.79 మిలియన్లు. గత నెలలో ఇండిగో మొత్తం 9.30 మిలియన్ల మంది ప్రయాణికులను 64 శాతం మార్కెట్ వాటాతో ప్రయాణించింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా గ్రూప్ 3.72 మిలియన్ల మంది ప్రయాణికులను నమోదు చేసి 26.5 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.

నెలలో మరో రెండు ప్రధాన క్యారియర్లు, అకాసా ఎయిర్, స్పైస్ జెట్ వరుసగా 0.74 మిలియన్లు మరియు 0.34 మిలియన్ల మంది ప్రయాణికులను ప్రయాణించాయి. నెలలో మరో రెండు ప్రధాన క్యారియర్లు, అకాసా ఎయిర్, స్పైస్ జెట్ వరుసగా 0.74 మిలియన్లు, 0.34 మిలియన్ల మంది ప్రయాణికులను ప్రయాణించారు. డేటా ప్రకారం.. మొత్తం దేశీయ ప్రయాణికుల రద్దీలో అకాసా మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉండగా, స్పైస్‌జెట్ వాటా 2.4 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి: School Holidays: భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు!

ఇవి కూడా చదవండి

ఇండిగో మే నెలలో అత్యధిక ఆన్-టైమ్ పనితీరును 84 శాతంగా అందించింది. ఆరు కీలక విమానాశ్రయాల నుండి 79.7 శాతం ఒటెపెని (OTP)ని పొందిన ఎయిర్ ఇండియా తర్వాతి స్థానంలో ఉంది. ఆ ఆరు విమానాశ్రయాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మరియు కోల్‌కతా.

ఇది కూడా చదవండి: Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

ఇది కూడా చదవండి: School Bags: జపాన్‌లో స్కూల్‌ బ్యాగుల ధరలు భారీగా ఎందుకు ఉంటాయి? ఒక్కో బ్యాగు ధర రూ.18 వేల నుంచి రూ.60 వేలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us