
దేశంలోని ప్రముఖ బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల పార్లమెంట్ కు నివేదిక సమర్పించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలో పాలసీదారులు వదిలేసిన సొమ్ము అక్షరాలా 880.93 కోట్లు ఉందని తెలిపింది. కాబట్టి పాత బాండ్లను ఉపయోగించి వారసులు, నామినీలు తమకు రావాల్సిన సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్ఐసీకి చెందిన 3.72 లక్షల మంది పాలసీదారులు తమ మెచ్యూరిటీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోలేదు. ఇటువంటి వాటిలో డెత్ క్లెయిమ్ ల పరిష్కారానికి ఈ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో 2019లో 89 కేసులు ఉండగా, అవి 2023 నాటికి పది కేసులకు తగ్గిపోయాయి. సంవత్సరాల వారీగా అన్ క్లెయిమ్ మెచ్యూరిటీ పాలసీల సొమ్ములు ఇలా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లు, 2022-23లో రూ.897 కోట్లు, 2023-24లో 880.93 కోట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
సాధారణంగా మూడు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పాలసీ ద్వారా లావాదేవీలు జరగకపోతే దాన్ని అన్ క్లెయిమ్ పాలసీగా భావిస్తారు. పాలసీని కొన్నాళ్లు కట్టి తర్వాత వదిలేయడం, పాలసీ మెచ్యూర్ అయినా డబ్బులు తీసుకోకపోవడం, పెద్దలు మరణిస్తే వారి పాలసీలను వారసులు పట్టించుకోకపోవడం తదితర అంశాలు దీనికి కారణం. ఎల్ఐసీ పాలసీదారులు, వారి వారసులు, నామినీలు సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే మెచ్యూరిటీ సొమ్ములను పొందే అవకాశం ఉంది. దానికోసం ఈ కింద తెలిపిన సులభ పద్దతులు పాటిస్తే చాలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి