Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు

|

Jul 24, 2024 | 4:35 PM

భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.

Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
Unemployment
Follow us on

భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి బడ్జెట్ ప్యాకేజీ కింద ఐదు సంవత్సరాల వ్యవధిలో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలలో సమగ్ర ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పనకు సంబంధించిన కేంద్రం నిర్ణయాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు 

స్కీమ్-ఏ

ఈ పథకం అన్ని అధికారిక రంగాలలో మొదటిసారిగా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే వారందరికీ ఒక నెల వేతన చెల్లింపును అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసిన మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాలలో ఒక నెల జీతానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ రూ.15,000 వరకు ఉంటుంది. అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష జీతం వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

స్కీమ్-బీ

ఈ పథకం మొదటి సారి ఉద్యోగులకు తయారీ రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహిస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నాలుగు సంవత్సరాలలో ఈపీఎఫ్ఓకు సంబంధించి ఉద్యోగి, యజమానికి ప్రోత్సాహం అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉపాధిలోకి ప్రవేశించే 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

స్కీమ్-సీ

ఈ స్కీమ్ సీ యజమాని కేంద్రీకృత పథకం అన్ని రంగాలలో అదనపు ఉపాధిని కవర్ చేస్తుంది. నెలకు రూ. 1 లక్ష జీతం పరిమితిలో ఉన్న అన్ని అదనపు ఉపాధి పథకం కింద లెక్కిస్తారు. ప్రతి అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ఓ ​​కంట్రిబ్యూషన్‌కు సంబంధించి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం యజమానులకు నెలకు రూ. 3,000 వరకు రీయింబర్స్ చేస్తుంది. ఈ పథకం 50 లక్షల మందికి అదనపు ఉపాధిని కల్పించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..