
Mutual Fund: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతటి సంపద సృష్టించవచ్చో నిరూపించింది ఒక హైబ్రిడ్ ఫండ్. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించి వారి భాగస్వామ్యాన్ని మరింత బలపరిచింది. వేల్యూ రీసెర్చ్ (Value Research) గణాంకాల ప్రకారం, ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్’ అనే పథకంలో 10 ఏళ్ల క్రితం నెల నెలా రూ.10,000 చొప్పున ఎస్ఐపీ ప్రారంభించిన ఇన్వెస్టర్ల నిధి ఇప్పుడు రూ.28 లక్షల మార్కును దాటింది.
ఇది కూడా చదవండి: RBI: త్వరలో ఆర్బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్కు క్లారిటీ..!
వేల్యూ రీసెర్చ్ ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ ప్రకారం ఈ ఫండ్ పనితీరు ఇలా ఉంది:
ఈ రకమైన హైబ్రిడ్ పథకం జూలై 2016 నుండి మార్చి 2026 మధ్య కాలంలో 13.2% CAGR నమోదు చేసింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 TRI 15.4% CAGR, నిఫ్టీ 100 TRI 11.7% CAGR రాబడిని ఇచ్చాయి.
‘బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్’ అనేది ఒక ఓపెన్-ఎండెడ్ హైబ్రిడ్ స్కీమ్. స్టాక్ మార్కెట్ లాభాలను అందుకోవడంతో పాటు డెట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్స్లో మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెట్ కలయిక (Hybrid Model) ఉన్న ఫండ్స్ సుదీర్ఘ కాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకుని క్రమబద్ధమైన ఎస్ఐపీ ద్వారా భారీ సంపదను సృష్టించగలవని ఈ ఫండ్ నిరూపించింది.
ఇది కూడా చదవండి: Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి