AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీకి కీలక బాధ్యతలు

Anant Ambani: ఈ నిర్ణయం అంబానీ కుటుంబం వారసత్వ ప్రణాళికలో భాగం. దీని కింద వ్యూహాత్మక బాధ్యతలను తరువాతి తరానికి అప్పగిస్తున్నారు. AGM లో కూడా, ముఖేష్ అంబానీ అనంత్ నాయకత్వ సామర్థ్యాన్ని, ఇంధన రంగం పై ఆయనకున్న అవగాహనను ప్రశంసించారు..

Anant Ambani: ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీకి కీలక బాధ్యతలు
Subhash Goud
|

Updated on: Apr 26, 2025 | 3:54 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ 2022 లోనే కంపెనీలోని వివిధ వ్యాపారాల బాధ్యతను తన ముగ్గురు పిల్లలకు విభజించారు. కుమార్తె ఇషా అంబానీకి రిటైల్ బాధ్యత, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి టెలికాం బాధ్యత, చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఇంధన రంగ బాధ్యత అప్పగించారు. కానీ ఇటీవల ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకుకు కొత్త బాధ్యతను అప్పగించారు.

అనంత అంబానీకి కొత్త బాధ్యత:

ఇప్పుడు ఆ కంపెనీ మరో పెద్ద అడుగు వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డు మే 1, 2025 నుండి ఐదు సంవత్సరాల కాలానికి అనంత్ అంబానీని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆయన కంపెనీతో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనుబంధంగా ఉన్నారు. అనంత్ అంబానీ మార్చి 2020 నుండి జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ బోర్డులో ఉన్నారు. మే 2022 నుండి ఆయన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డుకు కూడా తోడ్పడటం ప్రారంభించారు. దీనితో పాటు అతను జూన్ 2021 నుండి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డులో కూడా ఉన్నాడు. సెప్టెంబర్ 2022 నుండి అతను గ్రూప్ దాతృత్వ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా ఉన్నాడు. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన అనంత్, కంపెనీలోని అనేక కీలక రంగాలలో నాయకత్వ అనుభవాన్ని పొందాడు.

ఈ నిర్ణయం అంబానీ కుటుంబం వారసత్వ ప్రణాళికలో భాగం. దీని కింద వ్యూహాత్మక బాధ్యతలను తరువాతి తరానికి అప్పగిస్తున్నారు. AGM లో కూడా, ముఖేష్ అంబానీ అనంత్ నాయకత్వ సామర్థ్యాన్ని, ఇంధన రంగంపై ఆయనకున్న అవగాహనను ప్రశంసించారు.

ఆర్‌ఐఎల్ చరిత్ర సృష్టించింది:

జనవరి-మార్చి 2025 త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ద్వారా RIL కొత్త రికార్డును సృష్టించింది. 10 లక్షల కోట్ల రూపాయల ఈక్విటీని దాటిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

డిజిటల్ సేవల నుండి రికార్డు ఆదాయాలు:

ఈ త్రైమాసికంలో రిలయన్స్ డిజిటల్ సేవలు రికార్డు స్థాయిలో ఆదాయం, లాభాలను ఆర్జించాయని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. మెరుగైన యూజర్ ఎంగేజ్‌మెంట్, బలమైన సబ్‌స్క్రైబర్ మిశ్రమం కారణంగా ఆదాయాలు పెరిగాయి.

25,000 కోట్లు సేకరించాలని ప్రణాళిక:

25,000 కోట్ల వరకు నిధులు సేకరించడానికి RIL డైరెక్టర్ల బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్, సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలుగా సేకరించడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: iPhone 17 Series: ఐఫోన్ 17 ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో డమ్మీ ఫోన్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి