AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8వ వేతన సంఘం.. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అమలుతో జీతాలు, పెన్షన్లు 30-40 శాతం వరకు పెరగవచ్చు. 2026-27 నుండి అమలుకు అవకాశం ఉంది. ప్రభుత్వం దీనికి రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పై పెరుగుదల ఆధారపడనుంది.

8వ వేతన సంఘం.. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
Representative Image
SN Pasha
|

Updated on: Jul 10, 2025 | 4:42 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అదిరిపోయే శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కమిషన్ నివేదిక అమలు తర్వాత ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ 30 నుండి 40 శాతం వరకు పెరగవచ్చు. ఈ పెరుగుదల 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి రావచ్చు. దీనిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. గతంలో 7వ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం అదనంగా రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత నివేదికను సిద్ధం చేయడానికి వివిధ పార్టీలతో చర్చించడానికి సమయం పడుతుందని ఆంబిట్ క్యాపిటల్ తెలిపింది. 7వ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి 18 నెలలు పట్టింది. అందుకే కొత్త వేతన సంఘం సిఫార్సులు ఆర్థిక సంవత్సరం 2027 నాటికి అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ నిర్ణయించిన తర్వాత జీతం లెక్కించబడుతుందని నివేదిక పేర్కొంది.

వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ద్వారా జీతం పెరుగుతుంది. చివరిసారి 7వ వేతన కమిషన్‌లో దీనిని 2.57గా నిర్ణయించారు. దీని ప్రకారం కనీస ప్రాథమిక వేతనం రూ.18 వేలుగా ఉంది. అయితే ప్రతిసారీ కొత్త కమిషన్ అమలు చేసినప్పుడు డీఏ సున్నాగా చేస్తారు. ఇది వాస్తవ జీతం పెరుగుదలను తగ్గిస్తుంది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ చాలా బలంగా ఉంటుందని, దీని కారణంగా మొత్తం జీతంలో 30 నుండి 34 శాతం పెరుగుదల సాధ్యమవుతుందని ఆంబిట్ క్యాపిటల్‌ అంచనా వేసింది.

GDP ప్రయోజనం

జీతం, పెన్షన్ పెరుగుదల వినియోగం పెరుగుతుందని, ఇది GDPలో 30 నుండి 50 బేసిస్ పాయింట్ల వృద్ధికి దారితీస్తుందని ఆంబిట్ క్యాపిటల్ విశ్వసిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, బీమా, QSR, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (NBFCలు) ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందవచ్చు. చివరిసారి 7వ వేతన సంఘం FY16 GDP వృద్ధికి దాదాపు 200 బేసిస్ పాయింట్లను అందించింది.

8వ వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ నిధుల ద్వారా ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొంది. ఏకీకృత పెన్షన్ పథకం FY26 నుండి అమలు జరుగుతోంది. దీనిలో పెన్షన్ ఫండ్‌లో ప్రభుత్వ వాటా 14 శాతం నుండి 18.5 శాతానికి పెరుగుతుంది. ఇందులో 45 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి రూ.24,500 కోట్ల నుండి రూ.46,500 కోట్లకు పెరగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి