AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defence Budget 2026: కనిపించిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో 15 శాతం పెరుగుదల కనిపించింది. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని బడ్జెట్ కేటాయింపు ప్రతిబింబిస్తుంది. మూలధన బడ్జెట్ కూడా రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదలను చూసింది.

Defence Budget 2026: కనిపించిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్
Defence Budget 2026 Nirmala Sitharaman
Balaraju Goud
|

Updated on: Feb 01, 2026 | 4:03 PM

Share

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో 15 శాతం పెరుగుదల కనిపించింది. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని బడ్జెట్ కేటాయింపు ప్రతిబింబిస్తుంది. మూలధన బడ్జెట్ కూడా రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదలను చూసింది.

ఆదివారం (ఫిబ్రవరి 01) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ రూ. 7.85 లక్షల కోట్ల రక్షణ బడ్జెట్‌ను ప్రకటించారు. ఇందులో రూ. 2.19 లక్షల కోట్లు మూలధన బడ్జెట్, ఇది రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల. ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడు సేవలకు సైన్యం, వైమానిక దళం, నావికా దళాలకు ఆయుధాలు, ఆధునీకరణ కోసం దీన్ని వినియోగిస్తారు.

గత సంవత్సరం రక్షణ బడ్జెట్ ఎంత?

గత సంవత్సరం 2025-26 గాను రక్షణ బడ్జెట్ రూ. 6.81 లక్షల కోట్లు, అందులో రూ. 1.80 లక్షల కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు. గత దశాబ్దంలో, రక్షణ బడ్జెట్ 9-10% పెరుగుతోంది. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 15% పెరుగుదల ప్రభుత్వం తన సరిహద్దులను రక్షించుకోవడానికి, భవిష్యత్తు భద్రతను నిర్ధారించుకోవడానికి నిశ్చయించుకుందని సూచిస్తుంది. మొత్తంమీద, బడ్జెట్ 2026లో రక్షణ రంగంపై ప్రాధాన్యత ప్రభుత్వం ప్రస్తుత ముప్పులను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి దేశ సైనిక సామర్థ్యాలను కూడా బలోపేతం చేస్తోందని సూచిస్తుంది.

ప్రధాన ప్రాజెక్టుల బలోపేతం

2026 బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన బడ్జెట్ రాబోయే ప్రధాన రక్షణ ప్రాజెక్టులను బలోపేతం చేస్తుంది. దేశంలోని మూడు సాయుధ దళాలకు ఆధునిక ఆయుధాలు, కొత్త సాంకేతికత, మెరుగైన భద్రతా వ్యవస్థలను అందించడమే ప్రభుత్వ స్పష్టమైన ఉద్దేశ్యంగా పెట్టుకుంది. ఈ కొత్త బడ్జెట్ వైమానిక దళం, నేవీ, ఆర్మీ కోసం అనేక కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. నేవీ కోసం అదనపు రాఫెల్-ఎం ఫైటర్ జెట్‌ల కొనుగోలు ఈ బడ్జెట్‌లో ప్రధాన భాగంగా ఉంటుందని భావిస్తున్నారు. భారత వైమానిక దళం ఇప్పటికే 36 రాఫెల్ విమానాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు నేవీ కోసం 26 లేదా అంతకంటే ఎక్కువ రాఫెల్-ఎం జెట్‌లను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది సముద్ర సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. నేవీ, వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది.

జలాంతర్గామికి ప్రోత్సాహం..

2026 బడ్జెట్ జలాంతర్గామి రంగంలో గణనీయమైన ప్రయోజనాలను అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రాజెక్ట్ 75I అధునాతన AIP సాంకేతికతను కలిగి ఉన్న ఆరు కొత్త స్టెల్త్ జలాంతర్గాములను నిర్మించాలని యోచిస్తోంది. ఈ సాంకేతికత జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటి అడుగున ఉండటానికి అనుమతిస్తుంది. ఈ ఒప్పందం భారతదేశ సముద్ర భద్రతకు కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..