AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారు: టీడీపీ

విజయవాడ: తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు ఎమ్మార్వో కార్యాలయం ముందు స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణకు కృష్ణా జిల్లా ఆనుకుని ఉంటుంది. ఈ జిల్లాలోని వీరులపాడు మండలం, పెద్దాపురం గ్రామాల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ టీడీపీ నేతలు అంటున్నారు. కార్యకర్తలు వీరులపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఆందోళనకు చేపట్టారు. ఆ […]

తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారు: టీడీపీ
Vijay K
|

Updated on: Mar 07, 2019 | 6:27 PM

Share

విజయవాడ: తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు ఎమ్మార్వో కార్యాలయం ముందు స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణకు కృష్ణా జిల్లా ఆనుకుని ఉంటుంది. ఈ జిల్లాలోని వీరులపాడు మండలం, పెద్దాపురం గ్రామాల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ టీడీపీ నేతలు అంటున్నారు. కార్యకర్తలు వీరులపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఆందోళనకు చేపట్టారు.

ఆ కలపబడ్డ వారంతా వైసీపీ సానుభూతిపరులని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆధార్ కార్డు ఉండగా.. ఏపీ ఓటర్ల జాబితాలో ఎలా పేర్లను నమోదు చేశారని అధికార్లను నిలదీశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్య తీసుకుంటామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో ఆందోళనను టీడీపీ నాయకులు విరమించారు.

Follow Us