AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana : ఎంసెట్‌ సహా అన్నీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..

తెలంగాణలో మరోసారి ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ గడువును పొడిగించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన రిలీజ్ చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీఈ సెట్, పీజీ ఎల్‌సెట్‌,‌ అన్నీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఎలాంటి లేటు ఫీజు లేకుండా ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. గతంలో ఈనెల 15 వరకు ఎలాంటి లేటు ఫీజు లేకుండా దరఖాస్తుకు ఛాన్స్ ఇచ్చారు. తాజాగా […]

Telangana : ఎంసెట్‌ సహా అన్నీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..
Ram Naramaneni
|

Updated on: May 16, 2020 | 11:06 PM

Share

తెలంగాణలో మరోసారి ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ గడువును పొడిగించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన రిలీజ్ చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీఈ సెట్, పీజీ ఎల్‌సెట్‌,‌ అన్నీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఎలాంటి లేటు ఫీజు లేకుండా ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. గతంలో ఈనెల 15 వరకు ఎలాంటి లేటు ఫీజు లేకుండా దరఖాస్తుకు ఛాన్స్ ఇచ్చారు. తాజాగా ఆ తేదీని ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నీ వార్షిక పరీక్షలు, ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ విధించాక అనేక సార్లు ఎగ్జామ్స్ డేట్స్ విషయంలో ప్రకటనలు చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో పరీక్ష‌ల తేధీలు మారుతూ వస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణలో అన్నీ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ గడువును మే 31 వరకు పొడిగించారు.