AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇసుక దందాపై బ్రహ్మాస్త్రం.. ఆయన ఆధ్వర్యంలో బ్యూరో

ఏపీలో ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పక్కా చర్యలకు ఉపక్రమించింది సర్కార్. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు.

ఇసుక దందాపై బ్రహ్మాస్త్రం.. ఆయన ఆధ్వర్యంలో బ్యూరో
Rajesh Sharma
|

Updated on: May 09, 2020 | 9:11 PM

Share

ఏపీలో ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పక్కా చర్యలకు ఉపక్రమించింది సర్కార్. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్న ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకంటూనే.. దాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ బ్యూరో పని చేసేందుకు కోసం ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. ఐజి.. లేదా అంతకంటే పైస్థాయి అధికారిని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్‌గా ప్రభుత్వం నియమించనున్నది. మొత్తం 18 పోలీస్ యూనిట్లలో అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించబోతున్నట్లు సమాచారం. 18 మంది సభ్యులు గల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో ఏడుగురు ఐపిఎస్ అధికారులు పని చేయబోతున్నారు. ఈ వివరాలతో శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.