బ్రేకింగ్.. మ్యూచువల్ ఫండ్స్ కి మళ్ళీ ‘ప్రాణం’.. రూ. 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు.. రిజర్వ్ బ్యాంక్

ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్' ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది...

బ్రేకింగ్.. మ్యూచువల్ ఫండ్స్ కి మళ్ళీ 'ప్రాణం'.. రూ. 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు.. రిజర్వ్ బ్యాంక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2020 | 12:50 PM

ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 38 వేల కోట్లకు పైగా సొమ్ము లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేని పక్షంలో మన దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేందుకు తీసుకున్నఈ సౌలభ్యం సోమవారం నుంచి మే 11 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ఎం ఎఫ్ లపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఆర్ బీ ఐ తీసుకుంది. ఎస్ ఎల్ ఎఫ్-ఎం ఎఫ్ కింద 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను నిర్ణీత రెపో రేటులో నిర్వహిస్తామని బ్యాంకు తెలిపింది. సోమవారం నుంచి మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రెపో విండోలో ఫండ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్ఛు. ఎస్ఎల్ఎఫ్.. ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్ హెచ్టీఎం పోర్టుఫోలియోలో చేర్చడానికి అనుమతించిన మొత్తం పెట్టుబడిలో ఇరవై అయిదు శాతానికి మించి మెచ్యూరిటీ ఉంటుందని కూడా బ్యాంకు పేర్కొంది. ఈ దశలో హై రిస్క్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కి మాత్రమే స్ట్రెస్ ఉంటుందని, ఇతర మ్యూచువల్ ఇండస్ట్రీ లిక్విడిటీలో ఉంటుందని వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంపట్ల  మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ షేర్లలో మెరుగైన వృద్ది కనిపించింది. మార్చి మాసాంతానికి 86 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులతో ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థగా పాపులర్ అయింది. రెండు దశాబ్దాల క్రితం ఇది ఏర్పాటైంది.

కాగా… రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్నిపి. చిదంబరం స్వాగతించారు. రెండు రోజుల క్రితం తాను వెలిబుచ్చిన ఆందోళన నేపథ్యంలో సకాలంలో బ్యాంకు ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..