AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకే కాదు.. పురుషులకు కావాలి..!

మహిళా కమిషన్ లాగే పురుషులకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. 498A చట్టాన్ని చాలామంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని సంస్థ సభ్యులు ఆరోపించారు. ఢిల్లీలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సత్యాగ్రహానికి సంఘీభావంగా ఈ ఆందోళన […]

మహిళలకే కాదు.. పురుషులకు కావాలి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2019 | 8:11 AM

Share

మహిళా కమిషన్ లాగే పురుషులకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పురుషుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సత్యాగ్రహం నిర్వహించారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించారు. 498A చట్టాన్ని చాలామంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని సంస్థ సభ్యులు ఆరోపించారు. ఢిల్లీలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సత్యాగ్రహానికి సంఘీభావంగా ఈ ఆందోళన నిర్వహించారు.

498A చట్టం సాకుతో మహిళలు భర్తతో పాటు అత్తమామలను, ఆడపడుచులను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మహిళలు షీ టీంకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి పురుషులను వేధిస్తున్నారని సంస్థ సభ్యుడు వెంకట్ ఆరోపించారు. భర్త ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్న పోలీసులు. భార్యా బాధితుల ఫిర్యాదుల కూడా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సభ్యులు భారీ ఎత్తున హాజరయ్యారు. చాలా మంది పురుషులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.