July 1, 2026
Subhash
దేశంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గంటలలోనే బంగారం ధర తగ్గగా, వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1260 రూపాయలు తగ్గి 1,40,780 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అదే 22 క్యారెట్లపై 1150 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,29,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండిపై అతి స్వల్పంగా అంటే 500 రూపాయల వరకు పెరిగింది. దీని తర్వాత ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర 2,40,000 వద్ద ట్రేడవుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,780 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,29,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.
బంగారానికి డిమాండ్ దాదాపు 70 శాతం తగ్గినట్టు అంచనాలు వెలువడిన నేపథ్యంలో పసిడి ధరలు దిగి వచ్చాయి. రోజురోజుకు ధరలు దిగి రావడం మహిళలకు శుభవార్తేని చెప్పాలి.
పాత బంగారు నగలను అమ్మడానికి సాధారణ పౌరులు మొగ్గుచూపుతున్నారనే వార్తల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ మార్కెట్లో ఆశించిన స్థాయిలో విక్రయాలు లేకపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి.
ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయితే నగరాన్ని బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే జీఎస్టీ, ఇతర ఛార్జీలలో మార్పులు ఉంటాయి. కొనే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది.