AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్-19 : గృహ నిర్బంధంలోకి వెళ్లిన మరో ప్రధాని..!

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి దేశాధినేతలను సైతం వదలడంలేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రధాని యాసిన్ పాల్గొన్న ఓ సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో స్వయంగా గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన […]

కొవిడ్-19 : గృహ నిర్బంధంలోకి వెళ్లిన మరో ప్రధాని..!
Balaraju Goud
|

Updated on: May 22, 2020 | 9:49 PM

Share

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి దేశాధినేతలను సైతం వదలడంలేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రధాని యాసిన్ పాల్గొన్న ఓ సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో స్వయంగా గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ముహిద్దీన్ యాసిన్‌కు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాత్రం ఆయనకు కొవిడ్ సోకలేదని తేల్చారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ స్క్రీనింగ్ చేయించుకుని, హోమ్‌ క్వారైంటన్‌లో ఉండాలని ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గతంలో బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ముందుగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన్ను.. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కాగా, కోవిడ్‌-19 సోకడంతో స్పానిష్‌ రాణి మారియా థెరిసా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మలేషియా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.