AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవంతో వేడుకలు ప్రారంభం కాగా.. రెండోరోజు బృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో శ్రీశైలం కిక్కిరిసిపోయింది. వేలాదిగా శివస్వాములు మల్లన్న దర్శనానికి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకన్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. శ్రీశైలంతో పాటు […]

వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2019 | 9:00 AM

Share

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవంతో వేడుకలు ప్రారంభం కాగా.. రెండోరోజు బృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో శ్రీశైలం కిక్కిరిసిపోయింది. వేలాదిగా శివస్వాములు మల్లన్న దర్శనానికి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకన్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. శ్రీశైలంతో పాటు చుట్టుపక్కల దర్శనీయ స్థలాలుగా ఉన్న శిఖరం, పాలధార, పంచధార, సాక్షి గణపతి ఆలయాల్లోనూ భక్తులు క్యూ కట్టారు. శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, కర్నూలు ప్రాంతాలతో పాటు మహబూబ్ నగర్, హైదరాబాద్ నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామని అధికారులు వెల్లడించారు.