AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడొచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నాడు

తనకు, కాంగ్రెస్‌కు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు చంద్రబాబునాయుడు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లుగా తాను ఒంటరి పోరాటాన్ని చేస్తుంటే, ఇప్పుడొచ్చి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మూడు సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదాపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని.. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా హోదా కోసం పోరాడుతున్నానని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని తానెక్కడా […]

ఇప్పుడొచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నాడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 13, 2019 | 1:15 PM

Share

తనకు, కాంగ్రెస్‌కు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు చంద్రబాబునాయుడు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లుగా తాను ఒంటరి పోరాటాన్ని చేస్తుంటే, ఇప్పుడొచ్చి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

మూడు సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదాపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని.. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా హోదా కోసం పోరాడుతున్నానని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని తానెక్కడా అడ్డుకోలేదని కేవీపీ అన్నారు. కానీ చంద్రబాబు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కు, జాతీయ కాంగ్రెస్‌కు మధ్యలో గొడవలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.