శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కొలంబోలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా, నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.

శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2019 | 6:31 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కొలంబోలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా, నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.