AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత నీచమా చంద్రబాబూ ? నిప్పులు కక్కిన జగన్

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్మోహన్  రెడ్డి. పట్టపగలే నిస్సిగ్గుగా తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని వీడి.. పచ్చి బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏలూరు లో వైఎస్సార్ వాహన మిత్ర సభలో సీఎం జగన్ చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేశారు జగన్. అక్టోబర్ 2 న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు నన్ను బాధించాయన్నారు జగన్. గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచాము అంటూ చంద్రబాబు అబండాలు వేశారని […]

ఇంత నీచమా చంద్రబాబూ ? నిప్పులు కక్కిన జగన్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 2:20 PM

Share

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్మోహన్  రెడ్డి. పట్టపగలే నిస్సిగ్గుగా తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని వీడి.. పచ్చి బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏలూరు లో వైఎస్సార్ వాహన మిత్ర సభలో సీఎం జగన్ చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేశారు జగన్. అక్టోబర్ 2 న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు నన్ను బాధించాయన్నారు జగన్. గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచాము అంటూ చంద్రబాబు అబండాలు వేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడ మంచి పేరు వస్తుందోనని పట్టపగలే అబద్దాలు ఆడుతున్నారు చంద్రబాబు అంటూ సీఎం మండిపడ్డారు. ఇన్ని మాటలు మాట్లాడినా ఆ బాధలు ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తే పోతుందని చెప్పారు. అక్టోబర్ 2 న రాష్ట్రంలో సచివాలయాలు గొప్పగా ప్రారంభించామని జగన్ వెల్లడించారు. గాంధీ జయంతి నాడు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికి మద్యం పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు కనిపించాయని జగన్ చెప్పుకొచ్చారు. తెలుగు దేశం హయాంలో గ్రామాల్లో మంచినీళ్లు లేకపోయినా మద్యం మాత్రం దొరికేదాని జగన్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తివేశామని,  20 శాతం మద్యం షాపులు తగ్గించామని ఏపీ సీఎం వివరించారు.