ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్ సైన్యం

జమ్మూకాశ్మీర్ సరిహద్దు తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. పుల్వామాలో ఈ ఉదయం మళ్లీ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో నక్కిన ముష్కర మూక.. సైన్యంపై కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదుల కాల్పులను సైన్యం ధీటుగా తిప్పుకొట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు.. పుల్వామాలో ఉగ్రవాదుల కూంబింగ్ కొనసాగుతోంది. పుల్వామాలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల ఉనికిని పసిగట్టింది సైన్యం. ఉగ్రస్థావరం టార్గెట్‌గా భద్రతా సిబ్బంది శిబిరాన్ని చుట్టుముట్టాయి. సైన్యాన్ని చూసిన ముష్కర మూక.. […]

ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్ సైన్యం
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 12:07 PM

జమ్మూకాశ్మీర్ సరిహద్దు తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. పుల్వామాలో ఈ ఉదయం మళ్లీ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో నక్కిన ముష్కర మూక.. సైన్యంపై కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదుల కాల్పులను సైన్యం ధీటుగా తిప్పుకొట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు.. పుల్వామాలో ఉగ్రవాదుల కూంబింగ్ కొనసాగుతోంది.

పుల్వామాలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల ఉనికిని పసిగట్టింది సైన్యం. ఉగ్రస్థావరం టార్గెట్‌గా భద్రతా సిబ్బంది శిబిరాన్ని చుట్టుముట్టాయి. సైన్యాన్ని చూసిన ముష్కర మూక.. కాల్పులకు దిగింది. దీంతో.. లోపల తలదాచుకున్న ఇద్దరు టెర్రరిస్టుల్ని మట్టుబెట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ఖతం చేసింది సైన్యం.