AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హేమంత్‌ను అందుకే చంపేశారు !

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్‌ పరువు హత్య కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

హేమంత్‌ను అందుకే చంపేశారు !
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2020 | 6:34 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్‌ పరువు హత్య కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు కీలక ప్రశ్నలకు సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

అవంతి ప్రేమ విషయం తెలిసి వారించామని, ఇంట్లో నిర్బంధించినప్పటికీ తప్పించుకొని వెళ్లి పెళ్లి చేసుకుందని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పారు. పోలీసుల ద్వారా పెళ్లి గురించి తమకు తెలిసిందని.. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే ఫ్యామిలీ తమదని తెలిపారట. బయట తలెత్తుకొని తిరగలేక పోయామని అందుకే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు సమాచారం. అయితే హేమంత్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన ఏరియాలో నిందితులతో పోలీసులు మరోసారి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

మరోవైపు అవంతి, హేమంత్ ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమ ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇంత దారుణంగా హత్యకు పాల్పడిన నిందితులకు కూడా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీపీకి వినతి పత్రం అందించారు. దీనిపై సానుకూలగా స్పందించిన సీపీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !