AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా […]

బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2019 | 3:29 PM

Share

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా గుర్తించామన్నారు. ఆచూకీ తెలియాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మందికాగా.. మరో ఏడుగురు తెలంగాణ వారని మంత్రి తెలిపారు.

గోదావరిలో మునిగిన బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారని, దాని కిందే మిగిలిన మృతదేహాలు ఉండొచ్చని మంత్రి అంచనా వేశారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో బోటును బయటకు తీయడం కష్టంగా మారిందన్నారు. బోటులోనే మిగిలిన మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. బోటు ప్రమాదం ఘటనపై రెండు విచారణలు కొనసాగుతున్నాయన్నారు. బోటు ప్రమాదం సమయంలో 27 మందిని రక్షించిన గిరిజనులను మంత్రి అభినందించారు.

ఈనెల 15న పాపికొండల పర్యటనకు వెళ్లిన బోటు గోదావరిలో మునిగిపోయింది. కచ్చులూరు వద్ద పడవ నదిలో బోల్తా పడింది. ఆ సమయంలో 27 మంది ప్రయాణికులు ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఆరు రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే,బోటుకు అనుమతి లేదనే వాదన కూడా ఉంది. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడి వల్లే బోటును వదిలిపెట్టారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తుంది.

Follow Us
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది