AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. దేవదేవుని దర్శనం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్ప ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెల నుంచి ధన్వంతరి మహాయాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర […]

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 8:15 AM

Share

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. దేవదేవుని దర్శనం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్ప ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెల నుంచి ధన్వంతరి మహాయాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర ఏపీ ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరువురు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.