డా. కొండవీటి శివ నాగరాజు
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు | డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ – TV9 తెలుగు | పరిశోధకుడు | సామాజిక సేవకుడు | రచయిత
వ్యక్తిగత వివరాలు
పేరు: డా. కొండవీటి శివ నాగరాజు
విద్యార్హతలు
బి.ఏ – టి.జె.పి.ఎస్. కళాశాల, గుంటూరు
ఎం.ఏ (ఆర్కియాలజీ) – ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఫస్ట్ ర్యాంక్)
NSS ఓరియంటేషన్ కోర్సు – కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం – ఈనాడు జర్నలిజం స్కూల్, హైదరాబాద్
అధ్యాపక వృత్తి
జర్నలిజంలోకి రాకముందు విద్యారంగంలో సేవలందించారు.
లెక్చరర్ – KMS జూనియర్ కళాశాల, క్రోసూరు
NSS ప్రోగ్రాం ఆఫీసర్
ఇన్చార్జ్ ప్రిన్సిపాల్
లెక్చరర్ – TRR జూనియర్ కళాశాల, పిడుగురాళ్ల
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించడంలో విశేష కృషి చేశారు.
సామాజిక చైతన్యం – విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజాసేవ వరకు
రైతు కుటుంబంలో జన్మించిన డా. శివ నాగరాజు చిన్ననాటి నుంచే సామాజిక స్పృహతో ఎదిగారు.
1989–1996 మధ్య *స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)*లో చురుకుగా పనిచేశారు.
విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాల సందర్భంగా పలుమార్లు జైలుకూ వెళ్లిన అనుభవం ఉంది.
లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా చూసిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం *లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)*ను స్థాపించారు.
ఈ సంస్థ ద్వారా:
గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
గ్రామ ప్రజలకు అత్యల్ప ధరకు (20 లీటర్ల నీరు రూ.2కు) స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధుల ఏర్పాటు
విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు
గ్రామానికి చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం
ఈ సంస్థకు డైరెక్టర్గా సేవలందిస్తున్నారు.
పోటీ పరీక్షల శిక్షణ
గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో
గ్రూప్–1
గ్రూప్–2
ఇతర పోటీ పరీక్షలకు
ఉచిత మార్గదర్శక శిబిరాలు నిర్వహించారు.
జర్నలిజం ప్రస్థానం
1996లో ఈనాడు సంస్థలో కంట్రిబ్యూటర్గా ప్రారంభమైన ప్రయాణం…
తరువాత ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొంది
సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగు జర్నలిజంలో విశిష్ట సేవలందిస్తున్నారు.
పనిచేసిన సంస్థలు:
ఈనాడు
ఈటీవీ
ఎన్టీవీ
ఐ న్యూస్
ప్రస్తుతం TV9 తెలుగు – డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్
నిర్వహించిన బాధ్యతలు
కంట్రిబ్యూటర్
స్టాఫ్ రిపోర్టర్
సీనియర్ రిపోర్టర్
బ్యూరో చీఫ్
ఇన్పుట్ ఎడిటర్
చీఫ్ ఎడిటర్
రీసెర్చ్ ప్రొడ్యూసర్
డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్
సేవలందించిన జిల్లాలు :
గుంటూరు
కర్నూలు
అనంతపురం
ఖమ్మం
విశాఖపట్నం
హైదరాబాద్
జర్నలిజంలో ప్రత్యేకత
వందలాది లైవ్ కార్యక్రమాలు
సమకాలీన అంశాలపై విశ్లేషణలు
ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు
రాజకీయ చర్చలు
సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు
పరిశోధనాత్మక వార్తలు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాద మరణ సమయంలో ఎన్టీవీలో అందించిన ప్రత్యక్ష ప్రసారాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.
పరిశోధన – రచనలు
డా. శివ నాగరాజు కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు…
ఒక పరిశోధకుడు, రచయిత కూడా.
చరిత్ర
పురావస్తు
సామాజిక అంశాలు
రాజకీయ విశ్లేషణ
గ్రామీణాభివృద్ధి
ప్రజాపాలన
వంటి అంశాలపై అనేక పరిశోధనా వ్యాసాలు, విశ్లేషణాత్మక కథనాలు, పత్రికా రచనలు చేశారు.
ప్రముఖ పత్రికలు, మాసపత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
కరోనా సమయంలో సేవలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ…
జాగ్రత్తలు
ఆరోగ్య సూచనలు
ప్రభుత్వ మార్గదర్శకాలు
ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక కథనాలు
సిద్ధం చేసి విశేష గుర్తింపు పొందారు.
గౌరవ డాక్టరేట్లు
1. ఏసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, చెన్నై
12 నవంబర్ 2022
జర్నలిజం, సామాజిక సేవ, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2. అమెరికాలోని థియేలాజికల్ యూనివర్సిటీ
జర్నలిజం, పరిశోధన, సామాజిక సేవ, మానవీయ విలువల ప్రచారానికి చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమేన్ లెటర్స్ (Honorary Doctor of Humane Letters) బిరుదును ప్రదానం చేసింది.
ప్రధాన పురస్కారాలు
ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు – 2022 (తెలంగాణ పర్యాటక శాఖ)
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) – బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరణ
2025లో…
తెలంగాణ గవర్నర్ జిష్ణదేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ జర్నలిస్టు అవార్డు
ప్రెస్ వింగ్స్ క్లబ్ – అచీవ్మెంట్ అవార్డు
ఈనాడు సంస్థలో బెస్ట్ స్టోరీ అవార్డులు
ఈటీవీలో ఉత్తమ కంటెంట్, ప్రత్యేక కథనాల అవార్డులు
ఎన్టీవీ బెస్ట్ రిపోర్టర్ అవార్డు
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణ ఘటనపై విశేష కవరేజీకి
ప్రత్యేక గుర్తింపులు
అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యునిగా సేవలు
పరిశోధనాత్మక జర్నలిజంలో విశేష గుర్తింపు
సమకాలీన రాజకీయాలపై లోతైన విశ్లేషణలకు పేరుప్రఖ్యాతులు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
టీవీ9 జర్నలిజం శిక్షణా కార్యక్రమాల్లో అతిథి అధ్యాపకుడిగా, మెంటర్గా సేవలు
యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం
వ్యక్తిత్వం
డా. కొండవీటి శివ నాగరాజు వృత్తి నిబద్ధత, నిజాయితీ, పరిశోధనాత్మక దృక్పథం, సామాజిక బాధ్యత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారు. జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా సమాజ సేవకు ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తున్నారు.
“వార్తను చెప్పడం మాత్రమే కాదు… సమాజంలో మార్పు తీసుకురావడం కూడా జర్నలిస్టు బాధ్యత” అనే విలువను తన వృత్తి జీవితమంతా ఆచరణలో చూపించిన పాత్రికేయుడు డా. కొండవీటి శివ నాగరాజు.
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?
దేశంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఒక్క ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 9,866 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు తగ్గడం గమనార్హం. ఈ వరుసలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటం మరింత విచారకరం. ప్రైవేటు వైపు తల్లిదండ్రుల మొగ్గు, మౌలిక వసతుల లేమి, రేషనలైజేషన్ పేరిట విలీనాలే దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
- Siva Nagaraju
- Updated on: Aug 11, 2026
- 5:56 pm
అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్ నుంచి నాగార్జునసాగర్ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?
వర్షాల కోసం ప్రభుత్వాలు యాగాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. తాజాగా నాగార్జునసాగర్లో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మహా వరుణయాగం జరగడంతో.. యాగం చేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? యాగం తర్వాత వర్షం వస్తే దానికి కారణం యాగమేనా? అనే చర్చ మొదలైంది. వర్షపాతాన్ని రుతుపవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల కదలికలు, తేమ, ఎల్నినో, లా నినా వంటి అనేక వాతావరణ అంశాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- Siva Nagaraju
- Updated on: Aug 10, 2026
- 8:13 pm
హత్య తర్వాతే అసలు నేరం! శవం మాయం చేస్తే.. సాక్ష్యం మాయం అవుతుందా? కేసులను ఎలా చేధిస్తున్నారు!
హత్య చేశాడు. అక్కడితో నేరం ముగిసిందనుకున్నాడు. కానీ.. అసలు నేరం అక్కడి నుంచే మొదలైంది. హత్య చేసిన తర్వాత నిందితుడి మొదటి ఆలోచన ఏంటి? శవాన్ని ఎక్కడ దాచాలి? ఎలా మాయం చేయాలి? సాక్ష్యాలు ఎలా చెరిపేయాలి? పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలి? ఇదే హత్య తర్వాత నేరస్థులు ఆలోచించే విధానం.. మీర శవం మాయం చేసినంత మాత్రానా సాక్ష్యం మాయం అవుతుందా? వాళ్ల ఆలోచన కర్టేనా..?
- Siva Nagaraju
- Updated on: Aug 10, 2026
- 10:10 am
చేయని తప్పుకు శిక్ష? డాక్టర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు ICUలో..! మెడికోలను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్లో మెడికో ప్రియాంక రోడ్డు ప్రమాదం తర్వాత ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. డాక్టర్ కావాలన్న ఆమె కలను మరో వాహనదారుడి నిర్లక్ష్యం ప్రశ్నార్థకం చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్ కాలేజీల పరిసరాల్లో సేఫ్టీ ఆడిట్, రాత్రి సురక్షిత రవాణా, మద్యం మత్తులో డ్రైవింగ్పై కఠిన చర్యలు అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
- Siva Nagaraju
- Updated on: Aug 9, 2026
- 11:50 am
విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆందోళన చేస్తూనే.. మరోవైపు తమిళనాడు హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలంటున్న టీవీకే అధినేత విజయ్కు షాక్ ఇచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. విజయ్ పిలుపును పక్కన పెట్టి సమావేశానికి దూరంగా ఉన్నారు. 57 మంది ఎంపీలున్న తమిళనాడులో విజయ్ ఏర్పాటు చేసిన సమావేశానికి 20 మంది మాత్రమే హాజరయ్యారు. సంఖ్య పరంగా ఇది భారీ హాజరు కాదు. కానీ రాజకీయంగా చూస్తే.. ఈ 20 మంది ఎవరన్నదే ఇప్పుడు అసలు లెక్క. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయయాంశంగా మారింది.
- Siva Nagaraju
- Updated on: Aug 8, 2026
- 5:34 pm
Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..
ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ కోసం వెతుకుతుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజ్ పెంచే కథనాల కోసం అన్వేషిస్తాయి. అసలు నిజం ఏంటో దర్యాప్తులో తేలేలోపే.. ప్రెస్మీట్లు, సోషల్ మీడియా యుద్ధాలు, టీవీ డిబేట్ల హోరులో అబద్ధం ఊరంతా చెక్కర్లు కొడుతోంది.
- Siva Nagaraju
- Updated on: Aug 8, 2026
- 10:27 am
గూగుల్తో జాగ్రత్త గురూ.. వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పలు తప్పవు!
ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో చూసి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయితే నేరం చేయడానికి నిందితుడు ముందు దేనిలోనైతే వెతుకుతున్నాడో.. నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా మొదట దాని దగ్గరకే వెళ్తున్నారు. అదే గూగుల్.. ఈ ఒక్క గూగుల్ సెర్చే సమస్యలను సృష్టిస్తుంది.. పరిష్కారం చూపుతుంది. అందుకే ఒక సెర్చ్.. ఒక క్లూ.. ఒక నేరం.. చివరికి అదే సాక్ష్యం అంటారు.
- Siva Nagaraju
- Updated on: Aug 7, 2026
- 5:46 pm
ఇన్స్టాగ్రామ్.. నేరాలకు కొత్త గేట్వే? ఒక ఫాలోతో మొదలైన పరిచయం.. చివరికి..
ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోతో మొదలైన పరిచయం ఎలా నేరానికి దారి తీస్తుందో ఈ కథనం వివరిస్తుంది. ఫేక్ ప్రొఫైల్లు, హనీ ట్రాప్లు, రొమాన్స్ స్కామ్లు, సెక్స్టార్షన్ వంటి సైబర్ నేరాలు యువతను ఎలా టార్గెట్ చేస్తున్నాయి? సైబర్ పోలీసుల హెచ్చరికలు, గణాంకాలు, తప్పక పాటించాల్సిన భద్రతా సూచనలు తెలుసుకోండి.
- Siva Nagaraju
- Updated on: Aug 6, 2026
- 6:14 pm
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ! కొనసాగుతున్న కేసుల పరంపర
ఒకప్పుడు రాజకీయ నేతలపైనే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు వారి కుమారులు, కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తు, అరెస్టులు, కేసుల్లో కనిపిస్తున్నారు. ఇది చట్టం కఠినంగా అమలవుతున్న సంకేతమా? లేక రాజకీయ లక్ష్యసాధనలో భాగమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఈ కొత్త పరిణామంపై పూర్తి విశ్లేషణ.
- Siva Nagaraju
- Updated on: Aug 5, 2026
- 5:09 pm
ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా? ఇదెక్కడి న్యాయం?
గ్రామాలు ప్రభుత్వాలను గెలిపిస్తున్నా.. అభివృద్ధి మాత్రం నగరాలకే పరిమితమవుతోందా? పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఉద్యోగాలు ప్రధానంగా నగరాల్లోనే కేంద్రీకృతమవుతుండగా, గ్రామాలు సంక్షేమ పథకాలపైనే ఆధారపడుతున్నాయనే చర్చ సాగుతోంది. గ్రామీణాభివృద్ధి, స్థానిక ఉపాధి, పెట్టుబడుల సమాన పంపిణీపైనే ఇప్పుడు అసలు ప్రశ్నలు నిలుస్తున్నాయి.
- Siva Nagaraju
- Updated on: Aug 4, 2026
- 5:32 pm
అధికారం మారితే కేసుల కథ మారుతుందా? అప్పుడలా.. ఇప్పుడిలా..!
ప్రభుత్వం మారితే కేసుల దిశ కూడా మారుతుందా? 2019 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పులతో నమోదైన రాజకీయ కేసులు, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రభుత్వాల వాదనలు, చట్టం పాత్ర ఏంటి? కేసులు నిజంగా న్యాయ ప్రక్రియలో భాగమా? లేక రాజకీయ వ్యూహమా?
- Siva Nagaraju
- Updated on: Aug 3, 2026
- 6:53 pm
Hormuz Strait: వేల కిలోమీటర్ల దూరంలో ఉద్రిక్తత… మన వంటింటి ఖర్చుపై ఎంత ప్రభావం?
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలోని భారత కుటుంబాలపైనా పడొచ్చు. ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ చమురు మార్కెట్లో మార్పులు ఎలా మన నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.
- Siva Nagaraju
- Updated on: Aug 2, 2026
- 5:24 pm