డా. కొండవీటి శివ నాగరాజు
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు | డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ – TV9 తెలుగు | పరిశోధకుడు | సామాజిక సేవకుడు | రచయిత
వ్యక్తిగత వివరాలు
పేరు: డా. కొండవీటి శివ నాగరాజు
విద్యార్హతలు
బి.ఏ – టి.జె.పి.ఎస్. కళాశాల, గుంటూరు
ఎం.ఏ (ఆర్కియాలజీ) – ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఫస్ట్ ర్యాంక్)
NSS ఓరియంటేషన్ కోర్సు – కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం – ఈనాడు జర్నలిజం స్కూల్, హైదరాబాద్
అధ్యాపక వృత్తి
జర్నలిజంలోకి రాకముందు విద్యారంగంలో సేవలందించారు.
లెక్చరర్ – KMS జూనియర్ కళాశాల, క్రోసూరు
NSS ప్రోగ్రాం ఆఫీసర్
ఇన్చార్జ్ ప్రిన్సిపాల్
లెక్చరర్ – TRR జూనియర్ కళాశాల, పిడుగురాళ్ల
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించడంలో విశేష కృషి చేశారు.
సామాజిక చైతన్యం – విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజాసేవ వరకు
రైతు కుటుంబంలో జన్మించిన డా. శివ నాగరాజు చిన్ననాటి నుంచే సామాజిక స్పృహతో ఎదిగారు.
1989–1996 మధ్య *స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)*లో చురుకుగా పనిచేశారు.
విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాల సందర్భంగా పలుమార్లు జైలుకూ వెళ్లిన అనుభవం ఉంది.
లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా చూసిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం *లక్కరాజుగార్లపాడు ఫౌండేషన్ (LGF)*ను స్థాపించారు.
ఈ సంస్థ ద్వారా:
గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
గ్రామ ప్రజలకు అత్యల్ప ధరకు (20 లీటర్ల నీరు రూ.2కు) స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధుల ఏర్పాటు
విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు
గ్రామానికి చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం
ఈ సంస్థకు డైరెక్టర్గా సేవలందిస్తున్నారు.
పోటీ పరీక్షల శిక్షణ
గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో
గ్రూప్–1
గ్రూప్–2
ఇతర పోటీ పరీక్షలకు
ఉచిత మార్గదర్శక శిబిరాలు నిర్వహించారు.
జర్నలిజం ప్రస్థానం
1996లో ఈనాడు సంస్థలో కంట్రిబ్యూటర్గా ప్రారంభమైన ప్రయాణం…
తరువాత ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొంది
సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగు జర్నలిజంలో విశిష్ట సేవలందిస్తున్నారు.
పనిచేసిన సంస్థలు:
ఈనాడు
ఈటీవీ
ఎన్టీవీ
ఐ న్యూస్
ప్రస్తుతం TV9 తెలుగు – డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్
నిర్వహించిన బాధ్యతలు
కంట్రిబ్యూటర్
స్టాఫ్ రిపోర్టర్
సీనియర్ రిపోర్టర్
బ్యూరో చీఫ్
ఇన్పుట్ ఎడిటర్
చీఫ్ ఎడిటర్
రీసెర్చ్ ప్రొడ్యూసర్
డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్
సేవలందించిన జిల్లాలు :
గుంటూరు
కర్నూలు
అనంతపురం
ఖమ్మం
విశాఖపట్నం
హైదరాబాద్
జర్నలిజంలో ప్రత్యేకత
వందలాది లైవ్ కార్యక్రమాలు
సమకాలీన అంశాలపై విశ్లేషణలు
ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు
రాజకీయ చర్చలు
సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు
పరిశోధనాత్మక వార్తలు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాద మరణ సమయంలో ఎన్టీవీలో అందించిన ప్రత్యక్ష ప్రసారాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.
పరిశోధన – రచనలు
డా. శివ నాగరాజు కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు…
ఒక పరిశోధకుడు, రచయిత కూడా.
చరిత్ర
పురావస్తు
సామాజిక అంశాలు
రాజకీయ విశ్లేషణ
గ్రామీణాభివృద్ధి
ప్రజాపాలన
వంటి అంశాలపై అనేక పరిశోధనా వ్యాసాలు, విశ్లేషణాత్మక కథనాలు, పత్రికా రచనలు చేశారు.
ప్రముఖ పత్రికలు, మాసపత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
కరోనా సమయంలో సేవలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ…
జాగ్రత్తలు
ఆరోగ్య సూచనలు
ప్రభుత్వ మార్గదర్శకాలు
ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక కథనాలు
సిద్ధం చేసి విశేష గుర్తింపు పొందారు.
గౌరవ డాక్టరేట్లు
1. ఏసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, చెన్నై
12 నవంబర్ 2022
జర్నలిజం, సామాజిక సేవ, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2. అమెరికాలోని థియేలాజికల్ యూనివర్సిటీ
జర్నలిజం, పరిశోధన, సామాజిక సేవ, మానవీయ విలువల ప్రచారానికి చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమేన్ లెటర్స్ (Honorary Doctor of Humane Letters) బిరుదును ప్రదానం చేసింది.
ప్రధాన పురస్కారాలు
ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు – 2022 (తెలంగాణ పర్యాటక శాఖ)
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) – బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరణ
2025లో…
తెలంగాణ గవర్నర్ జిష్ణదేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ జర్నలిస్టు అవార్డు
ప్రెస్ వింగ్స్ క్లబ్ – అచీవ్మెంట్ అవార్డు
ఈనాడు సంస్థలో బెస్ట్ స్టోరీ అవార్డులు
ఈటీవీలో ఉత్తమ కంటెంట్, ప్రత్యేక కథనాల అవార్డులు
ఎన్టీవీ బెస్ట్ రిపోర్టర్ అవార్డు
డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణ ఘటనపై విశేష కవరేజీకి
ప్రత్యేక గుర్తింపులు
అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యునిగా సేవలు
పరిశోధనాత్మక జర్నలిజంలో విశేష గుర్తింపు
సమకాలీన రాజకీయాలపై లోతైన విశ్లేషణలకు పేరుప్రఖ్యాతులు
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అనేక ప్రత్యేక కథనాలు
టీవీ9 జర్నలిజం శిక్షణా కార్యక్రమాల్లో అతిథి అధ్యాపకుడిగా, మెంటర్గా సేవలు
యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం
వ్యక్తిత్వం
డా. కొండవీటి శివ నాగరాజు వృత్తి నిబద్ధత, నిజాయితీ, పరిశోధనాత్మక దృక్పథం, సామాజిక బాధ్యత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారు. జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా సమాజ సేవకు ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తున్నారు.
“వార్తను చెప్పడం మాత్రమే కాదు… సమాజంలో మార్పు తీసుకురావడం కూడా జర్నలిస్టు బాధ్యత” అనే విలువను తన వృత్తి జీవితమంతా ఆచరణలో చూపించిన పాత్రికేయుడు డా. కొండవీటి శివ నాగరాజు.
లడ్డూ పవిత్రతకు.. వైరల్ కల్చర్ ఎసరు?
తిరుమల శ్రీవారి లడ్డూను సామాజిక మాధ్యమాల్లో లైక్లు, షేర్ల కోసం ఉపయోగించిన వీడియో వైరల్ కావడంతో టీటీడీ విచారణకు ఆదేశించింది. పవిత్ర ప్రసాదం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రచారం వెనుక ఉద్దేశమేంటన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Siva Nagaraju
- Updated on: Sep 2, 2026
- 8:12 pm
డీలిమిటేషన్పై దక్షిణ రాష్ట్రాల్లో ఆందోళన ఎందుకు? ఐదు.. ఒక్కటైతే ఢిల్లీ మాట వింటుందా?
డీలిమిటేషన్, పన్నుల వాటా, నీళ్ల వివాదాలు, రాజకీయ ప్రాతినిధ్యంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. జనాభా నియంత్రణలో ముందున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తమ ఆర్థిక పనితీరుకు తగిన ప్రాతినిధ్యం కోరుతున్నాయి. జనాభా ఆధారిత సీట్లతో పాటు GSDP, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
- Siva Nagaraju
- Updated on: Aug 31, 2026
- 9:55 pm
Hyderabad: హైదరాబాద్లో నైట్ షిఫ్ట్.. మన నగరం ఎంత వరకు సేఫ్..
హైదరాబాద్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగుల కోసం నైట్ బస్ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరు ప్రధాన మార్గాల్లో తొలి దశలో 15 బస్సులు నడిపే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నైట్ బస్సులు అందుబాటులోకి రావడం మాత్రమే నైట్ సేఫ్టీకి పరిష్కారం కాదు.
- Siva Nagaraju
- Updated on: Aug 31, 2026
- 12:45 pm
నేపాల్ నేర్పిన గుణపాఠం.. హిమాలయాల్లోని ‘గ్లేసియర్ బాంబుల’పై ఆందోళన!
నేపాల్లో ఆగస్టు 26న సంభవించిన ఘోర విపత్తు హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న గ్లేసియర్ ప్రమాదాలపై ఆందోళనను పెంచుతోంది. గ్లేసియర్ కూలిపోవడంతో మంచు, రాళ్లు, మట్టి భారీగా కొండల నుంచి దిగువకు దూసుకొచ్చి నదీ లోయలను ముంచెత్తాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. విపత్తు అనంతరం కొత్తగా నీటి మడుగులు ఏర్పడటం, మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు హిమాలయ ప్రాంతాలపై పొంచి ఉన్న ముప్పును మరింత స్పష్టం చేస్తున్నాయి.
- Siva Nagaraju
- Updated on: Aug 29, 2026
- 4:34 pm
మరో జల ప్రళయం.. నేపాల్కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
నేపాల్ను వణికించిన భారీ వరదలు, ఫ్లాష్ఫ్లడ్స్ నుంచి కోలుకోకముందే మరో జల ప్రళయం ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. టిబెట్ వైపు సహజ నీటి అడ్డంకి లేదా ఆనకట్ట తెగిపోయిందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. హిమాలయాల్లో బ్యారియర్ లేక్లు, కొండచరియలు, భారీ వర్షాలతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
- Siva Nagaraju
- Updated on: Aug 28, 2026
- 6:58 pm
ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ..! అసలు మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో తుది నిర్ణయం ఏఐసీసీ చేతుల్లోకి వెళ్లింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు వివాదం ఏంటి? సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా? బీసీ రాజకీయాల ప్రభావం ఎంత? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
- Siva Nagaraju
- Updated on: Aug 27, 2026
- 8:50 pm
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్లో వరదలకు కారణమేంటి..
హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న గ్లేషియర్లు, పెరుగుతున్న హిమ సరస్సులు, కొండచరియలు, ఆకస్మిక వరదల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో తాజా వరదల నేపథ్యంలో గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) అంటే ఏమిటి? హిమాలయాల్లో వరదలు వస్తే భారత్లో ఏ రాష్ట్రాలకు ముప్పు ఉంటుంది? వరదల ప్రభావం ఎలా దిగువ ప్రాంతాలకు విస్తరిస్తుంది? ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పర్యవేక్షణతో నష్టాన్ని ఎలా తగ్గించవచ్చో ఈ కథనంలో తెలుసుకోండి.
- Siva Nagaraju
- Updated on: Aug 27, 2026
- 7:27 pm
ట్రంప్ వర్సెస్ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్ ఇదే.. మెయిల్ ఓటింగ్ ఎందుకంత కీలకం?
అమెరికా 2026 మిడ్టర్మ్ ఎన్నికలకు ముందు మెయిల్ బ్యాలెట్లపై వివాదం తీవ్రరూపం దాల్చింది. మెయిల్ ఓటింగ్పై నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ చర్యలను పలు రాష్ట్రాలు, డెమొక్రాట్లు కోర్టుల్లో సవాల్ చేస్తున్నారు. ఎన్నికల భద్రత, ఓటు హక్కు, రాష్ట్రాల అధికారం, అధ్యక్షుడి అధికార పరిమితి వంటి కీలక అంశాల చుట్టూ సాగుతున్న ఈ పోరు.. అమెరికా ప్రజాస్వామ్యానికి కీలక పరీక్షగా మారుతోంది.
- Siva Nagaraju
- Updated on: Aug 26, 2026
- 7:50 pm
Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్నా? ఫ్రీ పబ్లిసిటీనా?
రాఖీ యాడ్.. ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించిన ఈ యాడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కంగనా కామెంట్. కృతి కౌంటర్. రాహుల్ ఎంట్రీ. కంగనా రిప్లై. చివరకు యాడ్ తొలగింపు. ఇదంతా కేవలం బాలీవుడ్ ఫైట్ మాత్రమేనా? లేక సోషల్ మీడియా కాలంలో కాంట్రవర్సీనే కొత్త పబ్లిసిటీ గేమా అనే చర్చ సాగుతోంది.
- Siva Nagaraju
- Updated on: Aug 26, 2026
- 6:58 pm
Irumudi Movie: ఇరుముడి వివాదం.. క్రియేటివ్ ఫ్రీడమ్కు హద్దులెక్కడ..? మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది
రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం.. సినిమా సృజనాత్మక స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య ఉన్న సున్నితమైన గీతపై మరోసారి చర్చకు తెరతీసింది. ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల యూనిఫామ్, ఉపాధ్యాయురాలి పాత్ర చిత్రీకరణపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. అయితే ఒక వృత్తిలోని ప్రతికూల వ్యక్తిని చూపించడం, మొత్తం వృత్తినే కించపరిచేలా చిత్రీకరించడం మధ్య తేడాను గుర్తించడం కీలకం. దర్శకుల స్వేచ్ఛతో పాటు సామాజిక వర్గాల గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా ఉండాలనే చర్చ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
- Siva Nagaraju
- Updated on: Aug 25, 2026
- 7:08 pm
Hyderabad: హైదరాబాద్ భవనాలకు సేఫ్టీ ఏది..? ఇకనైనా గుణపాఠాలు నేరుస్తారా?
హైదరాబాద్లో నిర్మాణాలు శరవేగంగా పెరుగుతున్న వేళ భవనాల నిర్మాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గచ్చిబౌలి-అంజయ్యనగర్లో ఏడంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కేవలం 50 చదరపు గజాల స్థలంలో, నాలాకు ఆనుకుని నిర్మించిన ఈ భవనానికి రెండు అంతస్తులకే అనుమతి ఉన్నప్పటికీ ఏడు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత పక్కనున్న భవనాల భద్రతపైనా అధికారులు చర్యలు చేపట్టారు.
- Siva Nagaraju
- Updated on: Aug 24, 2026
- 6:09 pm
గోల్కొండ గర్భంలో ఏం ఉంది? తవ్వకాలతో మళ్లీ తెరపైకి సొరంగ రహస్యం
హైదరాబాద్ గోల్కొండలో తవ్వకాల సమయంలో సొరంగాన్ని పోలిన భూగర్భ నిర్మాణం బయటపడటం ఆసక్తిని రేపుతోంది. ఇది గోల్కొండ నుంచి చార్మినార్కు వెళ్లే రహస్య సొరంగమేనా అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు దీనికి చారిత్రక ఆధారాలు లేవు. నిర్మాణం నిజంగా ఏమిటో ASI పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. నిధులు ఉన్నాయన్న ప్రచారానికీ ఆధారాలు లేవు.
- Siva Nagaraju
- Updated on: Aug 21, 2026
- 8:09 pm