AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: వైసీపీ 5వ జాబితా విడుదల.. కీలక మార్పులు చేసిన అధిష్టానం..

ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది అధికార వైసీపీ. మొన్నటి వరకూ నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా ఐదవ జాబితా విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు జాబితాను ప్రకటించారు.

CM Jagan: వైసీపీ 5వ జాబితా విడుదల.. కీలక మార్పులు చేసిన అధిష్టానం..
Ap Ysrcp
Srikar T
|

Updated on: Jan 31, 2024 | 9:17 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది అధికార వైసీపీ. మొన్నటి వరకూ నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా ఐదవ జాబితా విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మారుస్తూ వారి పేర్లను, నియోజకవర్గాలను ప్రకటించింది.

అరకు వ్యాలీ అసెంబ్లీ అభ్యర్థిని మార్చేశారు. గొట్టేటి మాధవి స్థానంలో రేగా మత్స్య లింగంను నియమించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తికి గతంలో సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించిన అధిష్టానం తిరిగి తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగానే ప్రకటించింది. గురుమూర్తికి బదులు సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌ ను నియమించింది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌‎ పేరును ప్రకటించి.. అవనిగడ్డ అసెంబ్లీ బరిలో సింహాద్రి చంద్రశేఖరరావును నిలబెట్టబోతోంది.

కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్‌ పేరును ఖరారు చేసింది. ఈయన 2014లో వైయస్సార్‌సీపీ నుంచి పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఫైర్ బ్రాండ్, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ కు ప్రమోషన్ ఇచ్చింది అధిష్టానం. నెల్లూరు నుంచి కాకుండా నర్సారావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు రంగం సిద్దం చేసింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ