Andhra Pradesh: న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరం.. లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి ఫైర్..

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి. న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి.. కర్నూలులో పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Andhra Pradesh: న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరం.. లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి ఫైర్..
Shilpa Ravi Nara Lokesh

Updated on: Apr 23, 2023 | 9:48 AM

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి. న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి.. కర్నూలులో పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. దళితులు, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారని శిల్పారవి మండిపడ్డారు. ఏదో వివాదం జరగాలి.. యాత్రను ఆపేసి హైదరాబాద్‌లో కూర్చోవాలన్న ఆతృత.. లోకేష్‌లో కనిపిస్తుందంటూ శిల్పా రవి విమర్శలు చేశారు.

లోకేష్‌ పాదయాత్రపై కర్నూలులో గొడవలు సృష్టించేలా ఉందని శిల్పా రవి పేర్కొన్నారు. న్యాయరాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరమని.. దళితులు, మహిళా ఎమ్మెల్యేను కించపరచడం సరికాదంటూ లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు. యాత్ర ఆపేసి హైదరాబాద్‌లో కూర్చోవాలన్నారు.

కాగా, నారా లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే.. ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా లోకేష్ అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో 1000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us