Suicide: నెల్లూరులో దారుణం.. పిల్లలతో కలిసి నిప్పంటిచుకున్న మహిళ.. తల్లీ, కూతురు మృతి

|

Apr 23, 2021 | 9:07 AM

Mother, Daughter killed: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకోని ఆత్మహత్యాయత్నం

Suicide: నెల్లూరులో దారుణం.. పిల్లలతో కలిసి నిప్పంటిచుకున్న మహిళ.. తల్లీ, కూతురు మృతి
Follow us on

Mother, Daughter killed: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకోని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. వివరాలు.. నెల్లూరుకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:

Theif: సారీ.. అవి కరోనా వ్యాక్సిన్లు అని తెలియదు.. లెటర్ రాసి.. టీకాలను తిరిగిచ్చేసిన దొంగ..

Ex MLA Kethiri Sai reddy:హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత.. గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి