తూర్పుగోదావరిలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు

తూర్పుగోదావరి జిల్లా పొన్నాడ బషీర్ బాగ్ తీర్థంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన సుబానీ, అబ్దుల్లా తప్పిపోయారు. సుబానీ.. గుంటూరు జిల్లా చందోలుకు చెందిన చిన్నారి కాగా.. అబ్దుల్లా పొన్నూరుకు చెందిన వాడు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల […]

తూర్పుగోదావరిలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2019 | 1:25 PM

తూర్పుగోదావరి జిల్లా పొన్నాడ బషీర్ బాగ్ తీర్థంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన సుబానీ, అబ్దుల్లా తప్పిపోయారు. సుబానీ.. గుంటూరు జిల్లా చందోలుకు చెందిన చిన్నారి కాగా.. అబ్దుల్లా పొన్నూరుకు చెందిన వాడు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. కాకినాడ డీఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. చుట్టుపక్కల తోటల్లో కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. పిల్లలు ఏదైనా ఆటో ఎక్కి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.